Kolkata: కోల్కతాలోని ఆర్జీ కర్ మెడికల్ సెంటర్ అండ్ హాస్పిటల్లో ట్రైనీ డాక్టర్పై హత్యాచారం, హత్య జరిగిన తర్వాత జూనియర్ డాక్టర్లు నిరసన చేస్తున్నారు. సాల్ట్ లేక్లోని స్వాస్త్య భవన్ వెలుపల పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈరోజు (శనివారం) ఆకస్మికంగా సందర్శించారు.
కోల్కతా వైద్యురాలి హత్యాచార ఘటన ఓ వైపు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇంకోవైపు బుధవారం అర్ధరాత్రి వందలాది మంది అల్లరి మూకలు ఆర్జీ కర్ ఆస్పత్రిలోకి ప్రవేశించి సాక్ష్యాలను చెరిపివేయడం ఇప్పుడు పెను సంచలనంగా మారింది.