Kolkata Doctor Case: డాక్టర్ల నిరసనకు గవర్నర్ సంఘీభావం.. ఆస్పత్రి దగ్గరకు వెళ్లి మద్దతు
- కోల్కతాలో డాక్టర్ల నిరసనకు గవర్నర్ సంఘీభావం
- ఆస్పత్రి దగ్గరకు వెళ్లి గవర్నర్ ఆనంద బోస్ మద్దతు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోల్కతా వైద్యురాలి హత్యాచార ఘటన ఓ వైపు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇంకోవైపు బుధవారం అర్ధరాత్రి వందలాది మంది అల్లరి మూకలు ఆర్జీ కర్ ఆస్పత్రిలోకి ప్రవేశించి సాక్ష్యాలను చెరిపివేయడం ఇప్పుడు పెను సంచలనంగా మారింది. తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వమే ఇదంతా చేయిస్తోందని విపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. సీబీఐ రంగంలోకి దిగిన తర్వాత ఈ ఘటన చోటుచేసుకోవడం అనేక అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఉద్దేశ పూర్వకంగా ఆనవాళ్లు చెరిపేందుకే మమత ప్రభుత్వం ఇలా చేస్తోందని ఆరోపణలు వస్తున్నాయి.
ఇది కూడా చదవండి: Nalin Prabhat: ఏపీకి చెందిన ఐపీఎస్.. ఉగ్రవాదుల ఏరివేతలో దిట్ట..ఇప్పుడు కశ్మీర్ డీజీపీగా పోస్టింగ్
Also Read
- Ketan Agarwal Case: సియా-చేతన్ను కలిపిన ‘దీపావళి’.. ఆరోజు ఏం జరిగిందంటే..!
- Ketan Agarwal Case: కేఫ్లో గంటపాటు ప్రియుడితో కలిసి హత్యకు కుట్ర.. వెలుగులోకి వీడియోలు
- Khamenei funeral: ఖమేనీ అంత్యక్రియలకు ఇరాన్ ఆహ్వానం.. ఇరకాటంలో మోడీ సర్కార్..
- Passport Row: పాస్పోర్ట్ పౌరసత్వానికి రుజువు కాదు.. కేంద్రం క్లారిటీ..
ఇదిలా ఉంటే ఆర్జీ కర్ ఆస్పత్రి దగ్గర ఆందోళన చేస్తున్న డాక్లర్లు, నర్సులకు రాష్ట్ర గవర్నర్ ఆనంద బోస్ సంఘీభావం తెలిపారు. నిరసన తెలుపుతున్న వైద్యులకు తన మద్దతును ప్రకటించారు. ‘నేను మీతోనే ఉన్నాను’ అని ప్రకటించారు. ఆస్పత్రి దగ్గర విధ్వంసం సృష్టించిన అల్లరిమూకలపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మీతో కలిసి పోరాడతానని భరోసా కల్పించారు. తాజా ఘటనలతో డాక్టర్లు అభద్రతా భావంతో ఉన్నారని చెప్పారు. ఈ కేసు త్వరితగతిన పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. బెంగాల్ మహిళ సంతోషంగా జీవించేలా పరిస్థితులు మారాలన్నారు. అల్లరిమూకల విధ్వంసంపై పోలీసులతో చర్చిస్తానని.. అనంతరం మీడియాతో మాట్లాడతానని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: US video: ఎయిర్పోర్టులో మహిళ వీరంగం.. నేలకేసికొట్టిన కంప్యూటర్, ఫోన్
బుధవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో ఆర్జీ కర్ ఆస్పత్రి దగ్గర వైద్యుల జాగరణ సందర్భంగా అల్లరిమూకలు ఆసుపత్రి ఆవరణలోకి ప్రవేశించి దౌర్జన్యానికి దిగారు. వాహనాలపై దాడి చేశారు. ప్రజా ఆస్తులను ధ్వంసం చేశారు. దీంతో పోలీసులు లాఠీచార్జ్తో పాటు బాష్పవాయువు షెల్స్ను ప్రయోగించాల్సి వచ్చింది. 15 మంది పోలీసులు గాయపడ్డారని కోల్కతా పోలీసులు తెలిపారు.
ఆగస్టు 9న ఆర్జీ కర్ ఆస్పత్రిలో అర్ధరాత్రి వైద్యురాలు హత్యాచారానికి గురైంది. అత్యంత క్రూరంగా ఆమెపై సామూహిక అత్యాచారం జరిగినట్లుగా పోస్టుమార్టం నిర్వహించిన వైద్యులు పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఆమెలో 150 మిల్లీగ్రాముల వీర్యం ఉన్నట్లుగా తేలింది. గ్యాంగ్రేప్ కారణంగానే ఇంత వీర్యం ఉంటుందని వైద్యులు పేర్కొ్న్నారు. అలాగే బాధితురాలు తీవ్ర ప్రతిఘటన చేయడంతోనే ఆమెకు ఎక్కువ గాయాలు అయినట్లుగా అభిప్రాయపడుతున్నారు. అత్యంత హింసాత్మకంగా ఆమెపై దాడి జరిగిందని డాక్టర్లు పేర్కొంటున్నారు.
ఇది కూడా చదవండి: గ్లామర్ డోస్ పెంచేసిన ప్రగ్యా జైస్వాల్..
తాజావార్తలు
-
Ketan Agarwal Case: సియా-చేతన్ను కలిపిన ‘దీపావళి’.. ఆరోజు ఏం జరిగిందంటే..!
-
Deputy CM Pawan Kalyan: రాష్ట్ర సంపదను కాపాడుతాం.. స్మగ్లర్లకు పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్..
-
Khairatabad Ganesh : ఈ ఏడాది 70 అడుగుల ‘పంచముఖ సంకట హార మహా గణపతి’.!
-
T20 World Cup: గెలిస్తేనే సెమీస్ రేసులో.. లేదంటే లగేజ్ సర్దేసుకోవడమే.. టాస్ గెలిచిన బంగ్లాదేశ్..
-
Homemade Paneer : ఇంట్లోనే సాఫ్ట్ పనీర్.. ఈ ట్రిక్ తెలిస్తే చాలు!
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!