మాజీ బీజేపీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మ మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం దేశవ్యాప్తంగా రచ్చకు దారితీశాయి. పలు రాష్ట్రాల్లో గత శుక్రవారం ప్రార్థనల అనంతరం పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు జరిగాయి. ముఖ్యంగా యూపీ ప్రయాగ్ రాజ్, కాన్పూర్, సహరాన్ పూర్ లతో పాటు జార్ఖండ్ రాంచీలో, పశ్చిమ బెంగాల్ హౌరాలో హింసాత్మక ఘటనలు జరిగాయి. దీంతో పాటు ఢిల్లీ జమా మసీదులో, హైదరాబాద్ మక్కా మసీదుల్లో ముస్లింలు తమ నిరసన, ఆందోళన కార్యక్రమాలు…
బీజేపీ మాజీ అధికార ప్రతినిధి మహ్మద్ ప్రవక్తపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా ఉద్రిక్తలకు కారణం అవుతున్నాయి. ఇదిలా ఉంటే చాలా మంది ఈ వ్యాఖ్యల వీడియోను వైరల్ చేసి భావోద్వేగాలను రెచ్చగొడుతున్నారు. ఇప్పటికే నుపుర్ వ్యాఖ్యలపై శుక్రవారం రోజు ఢిల్లీ, యూపీలోని ప్రయాగ్ రాజ్, షహరాన్ పూర్ తో జార్ఖండ్ రాంచీ, బెంగాల్ హౌరాలో నిరసనలు, ఆందోళన కార్యక్రమాలను నిర్వహించారు. ప్రయాగ్ రాజ్, హౌరాలో ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. ఇదిలా ఉంటే కాశ్మీర్ కు…
మహమ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని తక్షణం అరెస్టు చేయాలని కోరుతూ శుక్రవారం దేశవ్యాప్తంగా ముస్లింలు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టిన విషయం తెలిసిందే. దేశంలోని నగరాలు, పట్టణాల్లో భారీ ప్రదర్శనలు నిర్వహించారు. భాజపా మాజీ అధికార ప్రతినిధులు నుపుర్శర్మ, నవీన్ కుమార్ జిందాల్ను శిక్షించాలంటూ నినాదాలు చేశారు. ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ సందర్భంగా పలుచోట్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ వ్యాఖ్యల వివాదం నేపథ్యంలో బెంగాల్లో రెండో రోజు కూడా అల్లర్లు జరిగాయి. హౌరా…
మహమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ మాజీ నేత నుపుర్ శర్మపై వీడియో తీసిన కశ్మీర్ యూట్యూబర్ ఫైసల్ వాని క్షమాపణలు చెప్పారు. నుపుర్ను నరికినట్లు తన వీడియోలో ఫైసల్ చూపించాడు. దాన్ని ఆన్లైన్లో అతను పోస్టు చేశాడు. మతపరమైన ఆరోపణలు చేసేవాళ్ల తల నరకడమే శిక్ష అని తన వీడియోలో యూట్యూబర్ ఫైసల్ పేర్కొన్నారు. గొడ్డలితో నుపుర్ తలను నరికినట్లు ఆ వీడియోలో గ్రాఫిక్స్ ప్రజెంట్ చేశాడు. నుపుర్ తలను విసిరేసినట్లుగా చూపించాడు. అయితే…
బీజేపీ మాజీ నేతలు నుపుర్ శర్మ, నవీన్ జిందాల్లు మహ్మద్ ప్రవక్తపై చేసిన అనుచిత వ్యాఖ్యల దుమారం ఇంకా తగ్గడం లేదు. ఇప్పటికే ఈ వ్యాఖ్యలపై ముస్లింలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నుపుర్ శర్మ, నవీన్ జిందాల్ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం దేశవ్యాప్తంగా ముస్లింలు పలు నగరాల్లో ఆందోళనలు, నిరసనలు చేపట్టిన విషయం తెలిసిందే. శుక్రవారం ప్రార్థనలు ముగిసిన తర్వాత జరిగిన ఈ ప్రదర్శనలు కొన్ని చోట్ల హింసకు దారితీశాయి. ఝార్ఖండ్ రాజధాని రాంచీలో…