Tollywood: టాలీవుడ్లో సినీ కార్మికుల సమ్మె 15వ రోజుకు చేరుకుంది. షూటింగ్స్ పూర్తిగా ఆగిపోవడంతో సగటు కార్మికులు విలవిలలాడుతున్నారు. నిర్మాతలతో చర్చలు ఫలితమివ్వకపోవడంతో ఫెడరేషన్ నాయకులు ఒక పక్క చర్చలు కొనసాగిస్తూనే మరోపక్క నిరసనలకు దిగుతున్నారు. ఈ సమస్యల నేపథ్యంలో ఈరోజు సాయంత్రం 4 గంటలకు ఫెడరేషన్ నాయకులు మెగాస్టార్ చిరంజీవిని కలవనున్నారు. అంతకు ముందు మధ్యాహ్నం 11 గంటలకు ఫెడరేషన్ కార్యాలయంలో కార్మిక సంఘాల సమావేశం జరగనుంది. నిన్న నిర్మాత సీ.కళ్యాణ్ కార్మిక సంఘాల సమస్యలపై…
Tollywood : సినీ కార్మికుల సమ్మె ఇంకా కొనసాగుతోంది. అటు నిర్మాతలు మొన్న చెప్పిన వేతనాల పెంపు విధానానికి కార్మికులు అస్సలు ఒప్పుకోవట్లేదు. మొత్తం 13 సంఘాలకు వేతనాలు 30 శాతం పెంచాల్సిందే అని పట్టుబడుతున్నారు. దీంతో నేడు రెండు రాష్ట్రాల సినిమాటోగ్రఫీ మంత్రులతో నేడు నిర్మాతలు భేటీ అయ్యారు. ఇటు తెలంగాణ సినిమాశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో పలువురు నిర్మాతలు చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఇరు వర్గాలు పట్టువిడుపుతో ఉండాలని సూచించారు.…
తెలుగు ఫిలిం ఫెడరేషన్ కార్మికులు తమ వేతనాలు, పారితోషికాలు 30% పెంచాలని డిమాండ్ చేస్తూ సమ్మెకు దిగిన విషయం తెలిసిందే. ఈ ఆకస్మిక నిర్ణయం కారణంగా టాలీవుడ్లోని అన్ని షూటింగ్స్ ఒక్కసారిగా ఆగిపోవడంతో పరిశ్రమ మొత్తం స్తంభించి పోయింది. ఇతర భాషా ఫిల్మ్ ఇండస్ట్రీలతో పోలిస్తే ఇప్పటికే తెలుగు సినీ కార్మికుల వేతనాలు ఎక్కువగా ఉన్నాయంటూ కొందరు నిర్మాతలు ఈ సమ్మెకు వ్యతిరేకంగా స్పందించగా, గత మూడు ఏళ్లుగా వేతనాల్లో పెంపు లేనందున ఈ డిమాండ్ సమంజసమేనని…