సౌత్ బ్యూటీ ప్రియమణి పెళ్లి తరువాత కూడా సినిమాల్లో రాణిస్తోంది. అయితే ఈసారి గ్లామర్ పాత్రలను కాకుండా నటనకు ఆస్కారం ఉన్న మంచి పాత్రలను ఎంచుకుంటోంది. ప్రస్తుతం ప్రియమణి ఆహాలో ప్రసారం కానున్న తెలుగు వెబ్ సిరీస్ ‘భామాకలాపం’తో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా తాజాగా ప్రియమణి ఓ మీడియా ఇంటరాక్షన్ లో ఇండస్ట్రీలో ఇప్పుడు కాలం మారిందని, హీరోయిన్లకు మంచి ప్రాధాన్యత లభిస్తోందని చెప్పుకొచ్చింది. అందుకు ఉదాహరణగా నయన్, సామ్ వంటి హీరోయిన్ల గురించి…
“ది ఫ్యామిలీ మ్యాన్ 2″లో ప్రియమణి తన బలమైన పాత్రతో బాలీవడ్ తో పాటు దక్షిణాదిలోనూ నటిగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ఈ బ్యూటీ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నటీమణులు మొత్తం సినిమాను తమ భుజాలపై మోయగలిగేలా కాలం మారిందని అభిపాయ పడింది. Read Also : లాహే సిస్టర్స్ తో ‘మ్యూజిక్ ఎన్ ప్లే విత్ సాకేత్’ లాఫింగ్ రైడ్! “ఖచ్చితంగా పరిస్థితులు మారాయి. హీరోయిన్ అంటే గ్లామర్ గా, పొట్టి…
ప్రముఖ ఓటిటీ సంస్థ ఆహా కొత్తకొత్త ప్రయోగాలకు సిద్దమవుతుంది. ప్రేక్షకులు కోరుకొనే అన్ని అంశాలను మేళవించి కొత్త కథలను ఎంచుకొని తన స్టామినాను పెంచుకొంటుంది. ఇప్పటికే టాక్ షోలు, సుకురవరం కొత్త సినిమాలతో మంచి జోష్ మీద ఉన్న ఆహా తాజాగా మరో కొత్త వెబ్ సిరీస్ తో రెడీ ఐపోయింది. సీనియర్ హీరోయిన్ ప్రియమణి ప్రధానపాత్రలో ‘డియర్ కామ్రేడ్’ ఫేమ్ భరత్ కమ్మ నిర్మాణంలో ‘భామ కలాపం’ పేరుతో సినిమా తెరకెక్కిస్తున్నారు. ఈసినిమాకు అభిమన్యు దర్శకత్వం…
హిందీ వెబ్ సీరిస్ ‘ది ఫ్యామిలీ మ్యాన్’తో యావత్ భారతదేశంలోని అభిమానులను ఆకట్టుకుంది ప్రియమణి. దానికి ముందే కొన్ని హిందీ చిత్రాలలోనూ ఆమె నటించడంతో ఆ వెబ్ సీరిస్ కు ఆమె కారణంగా మంచి క్రేజ్ ఏర్పడింది. తాజాగా ప్రియమణి తెలుగు వెబ్ మూవీలోనూ నటించి, మరోసారి నటిగా తన సత్తా చాటబోతోంది. అభిమన్యు తాడిమేటి తో కలిసి ‘డియర్ కామ్రేడ్’ ఫేమ్ భరత్ కమ్మ రూపొందించిన ‘భామా కలాపం’లో ప్రియమణి టైటిల్ రోల్ ప్లే చేసింది.…
టాలీవుడ్ లో మొన్నటివరకు సమంత- నాగ చైతన్య ల విడాకుల వార్తలు ఎంతటి సంచలనాన్ని సృష్టించాయి ప్రత్యేకంగా చెప్పకల్సిన అవసరం లేదు. తాము విడిపోతున్నట్లు ప్రకటించిన తర్వాత అభిమానులు కొంత సర్దుకున్నారు. ఇక సామ్- చై విడాకుల న్యూస్ అయిన తరుణంలోనే మరో స్టార్ హీరోయిన్ విడాకుల వార్తలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ప్రముఖ సీనియర్ నటి ప్రియమణి తన భర్తతో విడిపోతుందని వార్తలు గుప్పుమన్నాయి. 2017లో ప్రియమణి ఈవెంట్ ఆర్గనైజర్ ముస్తఫా రాజ్ ని…
బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ ఇటీవల తన తదుపరి ప్రాజెక్ట్ ను ప్రారంభించిన విషయం తెలిసిందే. నయనతార, ప్రియమణి ఈ సినిమాలో కథానాయికలు. రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో షారుఖ్ ఈ క్రేజీ యాక్షన్ ఎంటర్టైనర్ను నిర్మిస్తున్నారు. ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా మొదటి షెడ్యూల్ ను పూణేలో చిత్రీకరించారు. అక్కడ నుంచి లీకైన ఫోటోలలో షారుఖ్ సరికొత్త మేక్ఓవర్ లో కన్పించారు. లీకైన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.…
ఎప్పటినుంచో వినిపిస్తున్న షారూఖ్, అట్లీ సినిమా ఎట్టకేలకు పట్టాలెక్కింది. ఇటీవల ఈ సినిమా పూణేలో ప్రారంభమైంది. ప్రస్తుతం సినిమా ప్రధాన తారాగణం పాల్గొనగా కొన్ని కీలక సన్నివేశాలను అక్కడే చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రానికి ఇద్దరు ప్రముఖ సంగీత దర్శకులు పని చేయబోతున్నారట. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ పాటలు కంపోజ్ చేస్తుండగా, అనిరుధ్ రవిచందర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కంపోజ్ చేయబోతున్నట్లు టాక్. ఇంతకు ముందు రెహమాన్, అట్లీ కలసి ‘మెర్సల్, బిగిల్’ సినిమాలకు పని చేశారు.…
బాలీవుడ్ స్టార్ షారూఖ్, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ కలయికలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ సినిమా పూణేలో ప్రారంభమైంది. ఈ సినిమాలో షారూఖ్ సరసన దక్షిణాది తారలు నయనతార, ప్రియమణి నటిస్తున్నారు. ఈ సినిమాకు వర్కింగ్ టైటిల్ గా ‘సంకి’ అనే పేరు పెట్టారు. మిలిటరీ బ్యాక్ డ్రాప్ లో అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో షారూఖ్ ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు వినిపిస్తోంది. ఈ సినిమాను 2022లో విడుదల చేయనున్నారు. మరో…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్లో ఓ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం పవన్ ‘భీమ్లా నాయక్’.. ‘హరిహర వీరమల్లు’ సినిమా షూటింగులతో బిజీగా వున్నాడు. ఈ సినిమాల నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ గ్లింప్స్ ఆకట్టుకున్నాయి. త్వరలోనే పవన్ – హరీష్ శంకర్ సినిమా కూడా ప్రారంభం కానుంది. ఇప్పటికే వీరిద్దరూ కాంబోలో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఎప్పటి నుంచో ఒక ఇండస్ట్రీ హిట్…
నటి ప్రియమణి 2017లో ముస్తఫారాజ్ అనే వ్యాపారవేత్తను పెళ్లాడడం తెలిసిందే. అయితే, కొద్దిరోజులుగా ముస్తఫారాజ్ మొదటి భార్య ఆయేషా వారి పెళ్లిపై ఆరోపణలు చేస్తోంది. తాము ఇంకా విడాకులు తీసుకోలేదని, ప్రియమణితో తన భర్త రెండో పెళ్లి చెల్లదని చెబుతోంది. ముస్తఫా, తాను ఇప్పటికీ భార్యాభర్తలమేనని, ప్రియమణితో అతడి పెళ్లి నాటికి తాము విడాకులకు కూడా దరఖాస్తు చేయలేదని స్పష్టం చేసింది. కాగా, ముస్తఫారాజ్, ఆయేషా దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే విభేదాల నేపథ్యంలో 2010…