ప్రయాణికుల అవసరం.. ప్రైవేట్ ట్రావెల్స్ యజమానుల అవకాశం.. వెరశి ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. కొమురం భీం జిల్లాలో ప్రైవేటు ట్రావెల్ బస్సు యాజమాన్యం మోసం బయటపడింది. పరిమితికి మించి ప్రయాణికులను బస్సు లో ఎక్కించడం తో తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దు వాంకిడి చెక్ పోస్ట్ వద్ద బస్సును రవాణా శాఖ అధికారులు పట్టుకున్నారు. దీంతో ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్ నుంచి యూపీ, బీహార్ వెళ్లేందుకు ఒక ప్రైవేటుట్రావెల్స్ ద్వారా వెళుతున్న ప్రయాణికులు టికెట్ ధర…
పండుగలు వచ్చిందంటే చాలు.. యథేచ్ఛగా ప్రైవేటు ప్రజారవాణా సంస్థలు డబ్బులు దండుకోవడానికి సిద్ధమవుతుంటాయి. ప్రైవేటు ట్రావెల్స్ ధనదాహానికి సామాన్యుడి జేబుకు చిల్లుపడుతోంది. ఈ నేపథ్యంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న ప్రైవేటు ట్రావెల్స్పై అధికారులు కొరడా ఝుళిపిస్తున్నారు. తాజాగా హైదరాబాద్ శివారు పెద్ద అంబర్ పేట్ ఔటర్ రింగు రోడ్డుపై రంగారెడ్డి జిల్లా రవాణా శాఖ అధికారులు దాడులు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న వాటిపై అధికారుల బృందం కేసులు నమోదు చేస్తోంది. అంతేకాకుండా సంక్రాంతి పండుగ నేపథ్యంలో…