రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సిద్ధి మూత్ర విసర్జన కేసులో నిందితుడు ప్రవేశ్ శుక్లా నివాసాన్ని ధ్వంసం చేశారు. మంగళవారం ఓ వ్యక్తిపై మూత్ర విసర్జన చేస్తున్న వీడియో వైరల్ కావడంతో నిందితుడిని అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ బుల్ డోజర్ విధానాన్ని మధ్యప్రదేశ్ సర్కారు కూడా అనుసరిస్తున్నట్లు తెలుస్తోంది.