Kaleshwaram : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం వద్ద ప్రాణహిత నది మరోసారి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. మహారాష్ట్రలో కురిసిన భారీ వర్షాల ప్రభావంతో నదికి వచ్చే వరద నీటి ప్రవాహం భారీగా పెరిగింది. దీంతో పుష్కర ఘాట్ల వద్ద అలముకున్న తాత్కాలిక వ్యాపార స్థలాలు పూర్తిగా నీట మునిగాయి. ఇప్పటి వరకు నీటి కొరతతో వెలిసిన నదీ తీరంలో గుడారాలు వేసుకుని వ్యాపార కార్యకలాపాలు సాగించిన స్థానికులు, వరద ఉధృతికి అవన్నీ కోల్పోయారు. మరోవైపు, నీటి ఉధృతి…
గోదావరి ఉప నది ప్రాణహిత పుష్కరాలు ఇవాళ మొదలు కానున్నాయి. మీనరాశిలోకి బృహస్పతి ప్రవేశించినప్పుడు ప్రాణహిత నదికి పుష్కరం రానుంది. చైత్రశుద్ధ ద్వాదశి నుంచి చైత్రశుద్ధ బహుళ అష్టమి అంటే ఈ నెల 24 వరకు 12 రోజుల పాటు ప్రాణహిత పుష్కరాలు జరగనున్నాయి. కాళేశ్వరం వేదపండితులు నిర్ణయించిన ముహూర్తం ప్రకారం ఇవాళ మధ్యాహ్నం 3.54 గంటలకు పుష్కరాలు ప్రారంభంకానున్నాయి. కొమురంభీం జిల్లా కౌటాల, మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం అర్జునగుట్ట, వేమనపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లా…