IAF: రక్షణ రంగంలో ఇతర దేశాలపై ఆధారపడకుండా పూర్తి స్వదేశీ టెక్నాలజీతో ఆయుధాలు తయారు చేసుకోవాలని భారత్ భావిస్తోంది. దీని కోసమే ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్రమోడీ ప్రారంభించారు. యుద్ధవిమానాల దగ్గర నుంచి తుఫాకులు, ఫిరంగులు, హెలికాప్టర్లు ఇలా రక్షణ రంగంలో అవసరమయ్యే వాటిని ఇండియాలోనే తయారు చేసుకుని స్వావలంభన సాధించాలని కేంద్రం భావిస్తోంది.