ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో టాప్లో మెరిసిన పూజా హెగ్డే, ఇప్పుడు మళ్లీ అదే స్థాయిలో తిరిగి రావాలని తీవ్రంగా కృషి చేస్తోంది. వరుస ప్లాపులు కారణంగా కొంతకాలంగా తెలుగు తెరపై కనిపించని ఆమెకు, ఇప్పుడు ఓ భారీ ఛాన్స్ లభించింది. తెలుగులో చివరిగా ‘ఆచార్య’, ‘రాధే శ్యామ్’ సినిమాల్లో నటించిన పూజా, రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీగా ఫెయిల్ కావడంతో టాలీవుడ్ నుంచి దూరమైంది. హిందీ, తమిళం వంటి భాషల్లో అదృష్టాన్ని పరీక్షించు కున్నప్పటికీ…
కోలీవుడ్లో పూజా హెగ్డే మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రూపొందిన ‘రెట్రో’ సినిమాతో అమ్మడు డి గ్లామరస్గా ఎంట్రీ ఇచ్చింది. కానీ లాభం లేకుండా పోయింది. అనుకునంత కమ్బ్యాక్ అందుకోలేకపోయింది. ప్రస్తుతం పూజా తమిళ స్టార్ హీరో విజయ్తో నటిస్తున్న ‘జననాయకన్’ సినిమాలో నటిస్తోంది. తాజాగా ఆమె పాత్రకు సంబంధించిన షూటింగ్ కూడా పూర్తయింది. ఇకపోతే ‘కాంచన 4’ మూవీ లోనూ పూజా కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే.…