Home
Political News
Political News News
-
Hema : షూటింగ్లకే మూడ్ ఉండదు.. పవన్ కళ్యాణ్ను విమర్శిస్తారా?
పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ నటుడు ప్రకాష్ రాజ్ చేసిన ట్వీట్ కలకలం రేపుతోంది. తాజాగా ఆ ట్వీట్ ను ఉద్దేశిస్తూ నటి హేమ ఒక వీడియో రిలీజ్ చేశారు. ఆమె మాట్లాడుతూ ”హలో ప్రకాష్ రాజు గారు, ఈరోజు ఉదయం పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి మీరు చేసిన ట్వీట్ చూశాను. మనసు చివుక్కుమంది. పవన్ కళ్యాణ్ గారిని ‘దొర’ అని సంబోధించడం వెనక మీ వెటకారం అర్థమవుతుంది. తెలంగాణ ప్రాంతంలో ‘దొర’ అనే… -
TMC Crisis: మమత బెనర్జీకి మరో ఎదురుదెబ్బ.. కోల్కతా మేయర్ ఫిర్హాద్ హకీమ్ రాజీనామా..
TMC Crisis: తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) సంక్షోభం మరింత ముదిరింది. మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితుడైన ఫిర్హాద్ హకీమ్ కోల్కతా మేయర్ పదవికి బుధవారం రాజీనామా చేశారు. ఇప్పటికే ఎమ్మెల్యేల తిరుగుబాటు, రీటబ్రత బెనర్జీ రూపంలో ధిక్కారం ఎదుర్కొంటున్న మమతకు ఇది మరింత షాక్ ఇచ్చే పరిణామం. టీఎంసీలో పెరుగుతున్న అనిశ్చితి, వరసగా కోల్కతా మున్సిపల్ కార్పొరేషన్ (KMC)లో పార్టీ కౌన్సిలర్ల రాజీనామా నేపథ్యంలో మేయర్ పదవికి ఫిర్హాద్ హకీమ్ రాజీనామా చేయడం సంచలనంగా మారింది. టీఎంసీ ఓటమి… -
Trinamool Congress: మమతా బెనర్జీ సంచలన నిర్ణయం.. ఇలా చేసిందేంటి..
Trinamool Congress: పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) తీవ్ర సంక్షోభంలో ఉంది. పార్టీ సుప్రీమో మమతా బెనర్జీ మాట కూడా ఎమ్మెల్యేలు వినడం లేదు. మరోవైపు, మమత నుంచి పార్టీని, పార్టీ గుర్తును చేజిక్కించుకునే ప్రయత్నాల్లో రెబల్ ఎమ్మెల్యేల ఉన్నట్లు తెలుస్తోంది. ఆమె పిలుపు ఎమ్మెల్యేలు స్పందించడం లేదు. మంగళవారం కోల్కతాలో జరిగిన ధర్నాకు మొత్తం 80 మంది ఎమ్మెల్యేలకు కేవలం ఐదుగురే హాజరు కావడం సంచలంగా మారింది. రిటబ్రత బెనర్జీ… -
Kishan Reddy: సన్న బియ్యం పేరుతో పేదలను మోసం చేస్తున్నారా?.. ప్రభుత్వంపై కిషన్రెడ్డి తీవ్ర విమర్శలు
Kishan Reddy: మార్పు పేరుతో దొంగ మాటలు చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని.. తెలంగాణ రైతాంగం పట్ల నిర్లక్ష్యంగా నిస్సిగ్గుగా వ్యవహరిస్తుందని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి అన్నారు. తాజాగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడ లేని విధంగా దళారులు ప్రభుత్వం రైస్ మిల్లర్ల చేతిలో రైతులు విల విల లాడుతున్నారని తెలిపారు. ఈ ప్రభుత్వం చేతకాని తనం వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. మంత్రులు ఏసీ రూముల్లో గడిపారని.. తమ… -
Congress: భారత్పై నెతన్యాహూ ప్రశంసలు.. మోడీపై కాంగ్రెస్ విమర్శలు..
Congress: ప్రపంచం వ్యతిరేకిస్తున్నా, భారత్లో తమకు భారీ మద్దతు దొరుకుతుందని ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ అన్నారు. భారత్ నుంచే తమకు ఎక్కువ మంది ఫాలోవర్లు ఉన్నారని, భారత్లో ఇజ్రాయిల్ అంటే క్రేజ్ ఉందని ఆయన ప్రశంసలు కురిపించారు. నెతన్యాహు, ఆయన భార్య సారా న్యూఢిల్లీలో 2018లో పర్యటించిన సమయంలో ప్రధాని మోడీ నుంచి ఆప్యాయమైన స్వాగతాన్ని అందుకున్నట్లు చెప్పారు. అయితే, ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ప్రధాని నరేంద్రమోడీ ఇజ్రాయిల్కు అందిస్తున్న… -
CM Revanth Reddy: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై రేవంత్ ఫైర్.. కేంద్రంపై తీవ్ర విమర్శలు
CM Revanth Reddy: నరేంద్ర మోడీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకున్న పెట్రోల్, డీజిల్ ధరల పెంపు నిర్ణయం ఏ మాత్రం సమర్థనీయం కాదని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. ఈ నిర్ణయం అనేక రంగాల పై వ్యతిరేక ప్రభావం చూపుతుందని.. నిత్యావసరాల ధరలు పెరిగి సామాన్యుల పాలిట పిడుగుపాటు అవుతుందన్నారు. ఈ మేరకు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ చేశారు. “మోడీ ప్రభుత్వ అసమర్థ పాలన, అనాలోచిత విధానాల కారణంగా దేశ… -
YS Jagan : వైసీపీలోకి మోపిదేవి శ్రీనివాసరావు.. రేపల్లె బాధ్యత మనదే.. కార్యకర్తలే నా బలం
రేపల్లె కాంగ్రెస్ నేత మోపిదేవి శ్రీనివాసరావు వైసీపీలో చేరారు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ సమక్షంలో శ్రీనివాసరావు వైసీపీ పార్టీలో చేరారు. ఈ మేరకు తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్రకార్యాలయంలో శ్రీనివాసరావుకు వైఎస్సార్సీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు వైఎస్ జగన్. అనంతరం కార్యకర్తలను ఉద్దేశించి వైఎస్ జగన్ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన రేపల్లె నియోజకవర్గ రాజకీయాలపై , పార్టీ భవిష్యత్ కార్యాచరణపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రేపల్లె నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి… -
Pawan Kalyan : పొదుపు చర్యలపై ప్రజలకు ఇబ్బంది కలగొద్దు..!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ సమావేశంలో ప్రభుత్వ పొదుపు చర్యలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు , ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మధ్య లోతైన చర్చ జరిగింది. రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం చేపట్టదలచిన పొదుపు చర్యలను ఒక్కసారిగా ప్రజలపై రుద్దకుండా, వారికి తగిన అవగాహన కల్పించాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, పొదుపు చర్యలను మనం ఒకేసారి ప్రజలకు వివరిస్తే వారు ఇబ్బంది పడే అవకాశం ఉందని, అందుకే ఈ… -
KCR Meeting : ఎర్రవల్లి వేదికగా కేసీఆర్ మాస్టర్ ప్లాన్.. బీఆర్ఎస్ ప్రక్షాళనకు శ్రీకారం..!
KCR Meeting : బీఆర్ఎస్ పార్టీని మళ్లీ పూర్వ వైభవానికి తీసుకురావడమే లక్ష్యంగా అధినేత కేసీఆర్ తన వ్యూహాలకు పదును పెట్టారు. ఎర్రవల్లి ఫార్మ్హౌస్ వేదికగా సోమవారం జరిగిన కోర్ కమిటీ సమావేశంలో పార్టీ భవిష్యత్తు కార్యాచరణపై ఆయన కీలక దిశానిర్దేశం చేశారు. సుమారు 23 మంది ముఖ్య నేతలతో నిర్వహించిన ఈ భేటీలో పార్టీ సంస్థాగత నిర్మాణం, సభ్యత్వ నమోదు , క్షేత్రస్థాయి పోరాటాలపై కేసీఆర్ సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. గులాబీ పార్టీ బీఆర్ఎస్గా రూపాంతరం… -
PM Modi: పరాన్నజీవి కాంగ్రెస్, డీఎంకేను వెన్నుపోటు పొడిచింది.. ప్రధాని మోడీ ఫైర్..
PM Modi: తమిళనాడు కొత్త సీఎంగా బాధ్యతలు స్వీకరించిన విజయ్కు ప్రధాని నరేంద్రమోడీ అభినందనలు తెలియజేశారు. ఇదే సమయంలో అధికారం కోసం టీవీకేతో చేరిన కాంగ్రెస్పై విరుచుకుపడ్డారు. చిరకాల మిత్రపక్షమైన డీఎంకేను కాంగ్రెస్ వదిలేయడాన్ని ప్రస్తావిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ను ‘‘పరాన్నజీవి’’గా, ‘‘వెన్నుపోటుదారు’’గా విమర్శించారు. Read Also: Peddi : బుకింగ్స్ ఓపెన్ చేసిన గ్లోబల్ స్టార్..అమెరికాలో ‘పెద్ది’ సందడి.. టికెట్ రేట్లు ఇవే! ‘‘ప్రస్తుతం తమిళనాడులోని పరిస్థితిని చూడండి. 25-30 ఏళ్లుగా కాంగ్రెస్, డీఎంకేతో…
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: మరోసారి అదే నిర్లక్ష్యం.. మళ్లీ బొక్కబోర్లా పడ్డ వైభవ్.!
-
Aluminium Foil: చైనాకు భారత్ గట్టి దెబ్బ! ఈ లోహంపై యాంటీ-డంపింగ్ సుంకం పొడిగింపు..’మేక్ ఇన్ ఇండియా’కు బలం
-
Jagapathi Babu : ‘పెద్ది’ని దించాలని కొందరు ఇడియట్స్ ప్రయత్నించారు.. ట్రోలర్స్ కి జగ్గూ భాయ్ స్ట్రాంగ్ కౌంటర్
-
Airbus C295: భారత రక్షణ రంగంలో చారిత్రాత్మక ఘట్టం.. గగనతలంలోకి తొలి ‘మేడ్ ఇన్ ఇండియా’ మిలిటరీ విమానం..
-
EDLI Scheme: పీఎఫ్ ఖాతా ఉందా? ఉచితంగా రూ.7 లక్షల జీవిత బీమా.. EPF అందించే ఈ ప్రయోజనం గురించి తెలుసా?
ట్రెండింగ్
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!