నమ్మక ద్రోహానికి సంబంధించిన మరో దిగ్భ్రాంతికరమైన ఉదంతం వెలుగులోకి వచ్చింది. అల్వార్లోని ఐసిఐసిఐ బ్యాంక్ రీజనల్ హెడ్ కర్ణవ్ ఖత్రి (32)ని హతమార్చేందుకు ఘోరమైన కుట్ర జరిగింది. బుధవారం సాయంత్రం, బాధితుడి భార్య అర్చన అరోరా (30), ఆమె ప్రియుడు, టాక్సీ డ్రైవర్ అయిన రిషబ్ శర్మలను పోలీసులు అరెస్టు చేశారు. వారిపై హత్యకు కుట్ర, హత్య బెదిరింపులు, దోపిడీ ఆరోపణలు ఉన్నాయి. పోలీసుల విచారణ ప్రకారం, కర్ణవ్ ఖత్రి 2018లో అర్చన అరోరాను వివాహం చేసుకున్నారు.…