ఎప్పుడూ లేని విధంగా కేంద్ర ప్రభుత్వం ఈసారి ఆదివారం వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఇక ఎన్నడూ లేని విధంగా బడ్జెట్ కారణంగా మార్కెట్ కూడా సండే ఓపెన్ కావాల్సి వచ్చింది. ఇక బడ్జెట్లో ఏవైనా మెరుపులు ఉన్నాయంటే అది లేదు.
పార్లమెంట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్పై ప్రధాని మోడీ విమర్శలు ప్రశంసలు కురిపించారు. భారతదేశం అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా మారడమే లక్ష్యం కాదని.. ప్రపంచంలో మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించడమే లక్ష్యం అని ప్రధాని మోడీ అన్నారు.
జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా గుజరాత్లో పర్యటించారు. పర్యటనలో భాగంగా సబర్మతి నదీ తీరం దగ్గర ఐక్యతా విగ్రహాన్ని సందర్శించారు. ఇందకు సంబంధించిన ఫొటోను ముఖ్యమంత్రి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనికి ప్రధాని మోడీ స్పందించి ప్రశంసలు కురిపించారు.
ఆర్ఎస్ఎస్ అనేది భారతీయ సజీవ సంస్కృతికి ఆధునిక అక్షయ వటవృక్షమని ప్రధాని మోడీ అభివర్ణించారు. ప్రధాని మోడీ ఆదివారం నాగ్పుర్లోని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడారు. భారతీయ సంస్కృతికి, ఆధునికీకరణకు ఆర్ఎస్ఎస్ మర్రిచెట్టులాంటిదన్నారు