PM Modi: పశ్చిమ బెంగాల్ మాల్దాలో జరిగిన బహిరంగ సభలో ప్రధాని నరేంద్రమోడీ తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) , సీఎం మమతా బెనర్జీపై విరుచుకుపడ్డారు. టీఎంసీ ప్రభుత్వాన్ని మార్చాలని అవసరం ఉందని అన్నారు. దయలేని, క్రూరమైన మమతా బెనర్జీ ప్రభుత్వం ప్రజల డబ్బును దోచుకుంటోందని, కేంద్ర సహాయాన్ని బెంగాల్ ప్రజలకు చేరకుండా అడ్డుకుంటోందని ఆయన శనివారం అన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత బెంగాల్ అభివృద్ధికి దోహదపడుతుందని హామీ ఇచ్చారు.