ప్రొకబడ్డీ లీగ్ (పీకేఎల్) 12వ సీజన్లో తెలుగు టైటాన్స్ అద్భుత ఆటకు తెరపడింది. బుధవారం రాత్రి జరిగిన క్వాలిఫయర్-2లో పోరాడి ఓడింది. పుణెరి పల్టాన్ చేతిలో 50-45తో టైటాన్స్ ఓడిపోయింది. ఈ ఓటమితో టైటాన్స్ టోర్నీ నుంచి నిష్క్రమించగా.. విజయం సాధించిన పల్టాన్ ఫైనల్కు చేరుకుంది. ఇక టైటిల్ పోరు కోసం శుక్రవారం దబంగ్ ఢిల్లీని పల్టాన్ ఢీకొంటుంది. రెండు టీమ్స్ బలంగా ఉండడంతో ఫైనల్ మ్యాచ్ హోరాహోరీగా సాగే అవకాశాలు ఉన్నాయి. గత కొన్నేళ్లుగా పేలవ…
ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్)లో గత కొన్నేళ్ల పేలవ ప్రదర్శన చేసిన తెలుగు టైటాన్స్.. 12వ సీజన్లో నిలకడగా రాణిస్తోంది. వరుస విజయాలతో విజృంభిస్తున్న టైటాన్స్ ఈ సీజన్లో ఫైనల్కు అడుగు దూరంలో నిలిచింది. మంగళవారం హోరాహోరీగా సాగిన ఎలిమినేటర్-3లో మూడుసార్లు చాంపియన్ పట్నా పైరేట్స్పై 46–39తో విజయం సాధించింది. ఈ గెలుపుతో క్వాలిఫయర్-2కు మన తెలుగు టీమ్ అర్హత సాధించింది. ఈరోజు జరిగే క్వాలిఫయర్–2లో పుణేరి పల్టన్తో టైటాన్స్ తలపడనుంది. ఈ మ్యాచ్లో గెలిస్తే.. శుక్రవారం…
కబడ్డీ లెజెండ్ పర్దీప్ నర్వాల్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ప్రొఫెషనల్ కబడ్డీకి రిటైర్మెంట్ ప్రకటించాడు. ప్రో కబడ్డీ లీగ్ (పీకేఎల్) 2025 వేలంలో అమ్ముడుపోకపోవడంతో 28 ఏళ్ల పర్దీప్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. తాజాగా స్పోర్ట్స్ బ్రాడ్క్టాస్టర్ సునీల్ తనేజాతో జరిగిన లైవ్ ఇంటారక్షన్లో హర్యానా ఆటగాడు పర్దీప్ తన రిటైర్మెంట్ విషయాన్ని వెల్లడించాడు. విషయం తెలిసిన ఆయన ఫాన్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఇక తాను కోచ్ అవుతానని తనేజాతో పర్ధీప్ చెప్పాడు. ప్రో కబడ్డీ…