Pakistan: దాయాది దేశం పాకిస్తాన్ మరోసారి బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. కైబర్ ఫఖ్తుంఖ్వా రాజధాని పెషావర్ గురువారం బాంబు పేలుడు కారణంగా 9 మంది మరణించినట్లు, నలుగురు గాయపడినట్లు తెలుస్తోంది. పోలీస్ అధికారులే లక్ష్యంగా ఈ దాడి జరిగిందని పాక్ మీడియా నివేదించింది. ఈ సంఘటన వివరాలను పెషావర్ క్యాపిటల్ సిటీ పోలీస్ ఆఫీసర్ మియాన్ సయీద్ కార్యాలయం ధృవీకరించిందని డాన్ మీడియా తెలిపింది. ఈ సంఘటన తర్వాత పెద్ద ఎత్తున భద్రతా బలగాలు మోహరించాయి.