Home
Peddapalli
Peddapalli News
-
OTR: కలెక్టర్ vs పోలీస్?.. పెద్దపల్లిలో హాట్ టాపిక్గా మారిన రివ్యూ మీటింగ్
OTR: పెద్దపల్లి జిల్లా కలెక్టర్… కోయ శ్రీహర్షకు సమర్ధుడన్న పేరుంది. ఎటువంటి సమస్యనైనా చాకచక్యంగా పరిష్కరిస్తారని కూడా చెబుతారు. కానీ… ఇప్పుడాయన వ్యవహార శైలిలో వచ్చిన ఆకస్మిక మార్పు జిల్లాలో చర్చనీయాంశమైంది. ఇటీవల కొందరు పోలీసు, రెవెన్యూ విభాగాల అధికారులతో సమీక్ష నిర్వహించారట కలెక్టర్. అది సాధారణమే, జిల్లాలోని ఏ డిపార్ట్మెంట్ అధికారులనైనా పిలిచి రివ్యూ చేసే అధికారం కలెక్టర్కు ఉంటుంది. కానీ… అసలు కథ… అక్కడే మొదలైందని అంటున్నారు కొందరు. రెవెన్యూ శాఖ నేరుగా కలెక్టర్కే… -
Heavy Rains: తెలంగాణ అంతటా విస్తరించిన రుతుపవనాలు.. రాబోయే మూడు రోజుల్లో భారీ వర్షాలు!
Heavy Rains: నైరుతి రుతుపవనాలు ఎట్టకేలకు తెలంగాణ అంతటా విస్తరించడంతో రాష్ట్రవ్యాప్తంగా వరుణుడు విశ్వరూపం చూపిస్తున్నాడు. పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన ఉష్ణ పరిస్థితుల వల్ల ఈ ఏడాది కాస్త మందకొడిగా సాగిన పవనాలు.. జూన్ 8న రాష్ట్రాన్ని తాకినప్పటికీ, తెలంగాణను పూర్తిగా కమ్మేయడానికి దాదాపు 15 రోజుల సమయం తీసుకున్నాయి. ఈ ప్రభావంతో సోమవారం నుంచి మంగళవారం వరకు పలు జిల్లాల్లో రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది. ముఖ్యంగా పెద్దపల్లి జిల్లా శ్రీరాంపూర్ మండలం కూనారంలో ఏకంగా… -
Indian Railways: పెద్దపల్లిలో రైల్వే పట్టాలపై ఆగిన కారు.. నిలిచిపోయిన పలు రైళ్లు
రైల్వే గేటు దాటే క్రమంలో పలు వాహనాలు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. కొందరు నిర్లక్ష్యంగా రైల్వే గేటు దాటుతూ ప్రమాదాలకు కారణమవుతున్నారు. రైల్వే సిబ్బంది విదుల్లో నిర్లక్ష్యం కారణంగా కూడా రైలు ప్రమాదాలకు కారణమవుతున్నాయి. తాజాగా పెద్దపల్లి జిల్లాలో ప్రమాదం తప్పింది. పెద్దపల్లి పట్టణ సమీపంలోని కూనారం రైల్వే గేట్ వద్ద ఓ కారు రైల్వే పట్టాలపై ఆగిపోయింది. కారు గేటు దాటకముందే రైల్వే సిబ్బంది గేటు వేయడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. Also Read:Akhanda2… -
Railway Line : రామగుండం-మణుగూరు రైల్వే లైన్కు ఆమోదం..!
Railway Line : దాదాపు పదేళ్లుగా పెండింగ్లో ఉన్న రామగుండం-మణుగూరు కొత్త రైల్వే లైన్ ప్రాజెక్ట్కు కేంద్ర రైల్వే శాఖ నుండి చివరకు ఇన్-ప్రిన్సిపల్ అప్రూవల్ లభించింది. ఈ నిర్ణయంతో పెద్దపల్లి ప్రజల్లో హర్షం వ్యక్తమవుతోంది. రైల్వే సమస్యల పరిష్కారంలో ఎంపీ గడ్డం వంశీకృష్ణ కృషి ఫలిస్తున్నదని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎంపీ వంశీ మాట్లాడుతూ.. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్కు సంబంధించిన డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (DPR) ఇప్పటికే సిద్ధమైందని, సుమారు రూ. 4 వేల… -
Sand Mafia : చెక్ డ్యాంను రాత్రికి రాత్రి కూల్చివేసిన దుండగులు,
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం గుంపుల గ్రామంలో గల చెక్ డ్యాము ను గుర్తు తెలియని దుండగులు పేల్చివేశారు. గుంపుల మానేరు వద్ద గల చెక్ డ్యాం ను శుక్రవారం రాత్రి గుర్తుతెలియని దుండగులు పేల్చివేయడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. -
Theft: పెన్షన్ మంజూరు అయ్యిందని.. ఫొటో దించాలని వృద్ధురాలిని నమ్మించి.. మూడు తులాల పుస్తెలతాడు చోరీ
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో దారుణం చోటుచేసుకుంది. పెన్షన్ వచ్చిందని వృద్ధురాలిని నమ్మించి మెడలో ఉన్న మూడు తులాల పుస్తెలతాడు చోరీ చేశాడు ఓ అగంతకుడు. మాయ మాటలు చెప్పి రూ. 4,000 పెన్షన్ మంజూరు అయ్యిందని ఫొటో దించాలని నమ్మబలికి దొంగతనానికి పాల్పడ్డాడు. వృద్ధురాలితో మాట్లాడిన దృశ్యాలు సీసీ ఫుటేజిలో రికార్డు అయ్యాయి. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన బాధితురాలు శంకరమ్మ. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. Also Read:Hamas:… -
Snapchat Love: పెద్దపల్లిలో స్నాప్చాట్ ప్రేమ.. యువకుడి ఇంటిముందు ఇద్దరు పిల్లల తల్లి ధర్నా!
ఇద్దరు పిల్లలకు తల్లి అయిన ఓ మహిళ.. తనకంటే చిన్న వయస్కుడైన యువకుడిని ప్రేమించింది. యువకుడి ప్రేమలో మునిగిపోయిన మహిళ.. ఇద్దరు పిల్లలు ఉన్నారనే సంగతే మర్చిపోయింది. విషయం భర్తకు తెలియండంతో ఆమెను ఇంట్లో నుంచి వెళ్లగొట్టాడు. భర్త, పిల్లలను కాదనుకున్న ఆ మహిళ.. తనకు ప్రియుడే దిక్కని నిశ్చయించుకుంది. తనను పెళ్లి చేసుకోవాలని ప్రియుడి ఇంటిముందు ధర్నాకు దిగింది. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి మండలం అప్పన్నపేట గ్రామంలో చోటుచేసుకుంది. కరీంనగర్కు చెందిన సంధ్య… -
Peddapalli: ఫేస్ బుక్ పరిచయం.. ప్రేమగా మారి.. ఇంట్లో కలిసి ఉండగా..
పెళ్లి కాని యువతీ యువకులే కాదు.. పెళ్లైన వారు కూడా ప్రేమ పేరుతో కొత్త సంబంధాలను ఏర్పర్చుకుంటున్నారు. అక్రమ సంబంధాలు పెట్టుకుని కుటుంబాలను రోడ్డునపడేసుకుంటున్నారు. కొందరు అవమాన భారంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. సోషల్ మీడియా వచ్చాక ఇది మరింత పెరిగింది. ఫేస్ బుక్, ఇన్ స్టా పరిచయాలు అక్రమ సంబంధాలకు దారితీస్తున్నాయి. తాజాగా ఇద్దరు వివాహితులు ఫేస్ బుక్ ద్వారా పరిచయం పెంచుకుని అక్రమ సంబంధం పెట్టుకున్నారు. ఆ తర్వాత అడ్డంగా బుక్కై పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు… -
Off The Record: ఎంపీ గడ్డం వంశీ వ్యవహారశైలిపై కాంగ్రెస్ లో చర్చ! టచ్ మీ నాట్ వైఖరితో పెరుగుతున్న గ్యాప్
గడ్డం వంశీకృష్ణ.. పెద్దపల్లి ఎంపీ. 35 ఏళ్లకే లోక్సభలో అడుగుపెట్టారీ పొలిటికల్ వారసుడు. కాకా కుటుంబం నుంచి పెద్దపల్లి సీట్కు ప్రాతినిధ్యం వహిస్తోన్న మూడో తరం నాయకుడు. అంతవరకు బాగానే ఉందిగానీ.. ఇప్పుడాయన వ్యవహారశైలి గురించే పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది నియోజకవర్గంలో. అటు పార్టీ కార్యక్రమాల్లో, ఇటు ప్రభుత్వ ప్రోగ్రామ్స్లో ప్రోటోకాల్ ప్రకారం పిలుపులు ఉండటం లేదన్నది ఎంపీ అనుచరుల ఆరోపణ. ఐడెంటిటీ సమస్య కావడంతో ఆగ్రహంతో ఉన్నారట ఎంపీసాబ్. -
Peddapalli: యువకుడి ప్రాణం తీసిన వాటర్ క్యాన్..! అదేలా..?
వాటర్ క్యాన్ ఓ యువకుడి ప్రాణం తీసింది..! వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. వాటర్ క్యాన్ మూలంగా ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.. బావిలో ఈత కొట్టేందుకు యువకుడు వాటర్ క్యాన్ డబ్బాను కట్టుకొని ఈతకు వెళ్లగా.. ఆ క్యాన్ కు హోల్ పడి నీళ్లు లోనికి వెళ్లి ఆ యువకుడు నీట మునిగి మరణించిన ఘటన పెద్దపల్లి జిల్లాలో చోటుచేసుకుంది..
తాజావార్తలు
-
NTR : బాలా బాబాయ్ త్వరగా కోలుకోవాలి!
-
Sonam Wangchuk: సోనమ్ వాంగ్చుక్కు ఊరట.. మెదాంతకు తరలించాలని హైకోర్టు ఆదేశం..
-
Rahul Gandhi-Om Birla: లోక్సభ స్పీకర్తో రాహుల్ గాంధీ భేటీ.. ఏం డిమాండ్ చేశారంటే..!
-
Kalyan Ram: ‘గెట్ వెల్ సూన్ బాబాయ్’.. బాలయ్య కోసం కళ్యాణ్ రామ్ ఎమోషనల్ పోస్ట్ వైరల్!
-
Gopichand Malineni: ఫ్యాన్స్ టెన్షన్ పడొద్దు.. బాలయ్యకు స్వల్ప గాయమే
ట్రెండింగ్
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!
-
తెలంగాణ ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ (TGTET-2026) నోటిఫికేషన్ విడుదల..!
-
స్క్రీన్ లేకుండానే పనిచేసే Google Fitbit Air త్వరలో భారత్లో లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
Railway Bedsheet Kurta: ఎంతకు తెగించార్రా.. రైల్వే బెడ్షీట్తో కుర్తా ఏంటయ్యా.? వైరల్ వీడియో..
-
Realme Power Days సేల్.. P4 Power 5G, P4 Pro 5Gపై భారీ తగ్గింపు.. ఆఫర్లు ఇవే.!