డిజిటల్ చెల్లింపుల సంస్థ పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ బోర్డు స్వతంత్రమైనది అని సీఈఓ విజయ్ శేఖర్ శర్మ తెలిపారు. అలాగే, పేటిఎం నియంత్రణ సమస్యలను పరిష్కరించగల సామర్థ్యం కలిగి ఉందన్నారు.
జిటల్ చెల్లింపులలో ఓ వెలుగు వెలిగిన పేటిఏం సంస్థ ప్రస్తుతం తీవ్ర సంక్షోభంలో కొనసాగుతోంది. అయితే, ఫెమా నిబంధనల ప్రకారం కంపెనీపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు దర్యాప్తు ప్రారంభించినట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అధికారులు కంపెనీ వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మను కలిశారని తెలుస్తుంది.
గత కొద్దీ రోజులుగా పేటీఎం షేర్లు ఒక్కసారిగా పడిపోవడంతో దాని వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో వినియోగదారులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేటీఎం వ్యవస్థాపకుడు, సీఈవో విజయ్ శేఖర్ శర్మ తెలిపారు.