ప్రధాని నరేంద్ర మోడీ లోక్సభ, రాజ్యసభలోని అన్ని రాజకీయ పార్టీల ఫ్లోర్ లీడర్లకు లేఖ రాసి, నారీ శక్తి వందన్ అధినియమ్ (మహిళల రిజర్వేషన్ చట్టం) త్వరిత అమలుకు మద్దతు కోరారు. ఏప్రిల్ 16, 17, 18 తేదీల్లో జరగనున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశంలో ఈ చట్ట సవరణ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు. ప్రధాని మోడీ తన లేఖలో “మహిళల రిజర్వేషన్ చట్టాన్ని నిజమైన స్ఫూర్తితో అమలు చేసే సమయం వచ్చేసింది” అని పేర్కొన్నారు.…
ప్రస్తుతం రెండో విడత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఏప్రిల్ 2 వరకు సమావేశాలు జరగనున్నాయి. అయితే ఈ సమావేశాల్లోనే మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుకురావాలని కేంద్రం ఆలోచిస్తోంది.