Pakistan: నిన్న శ్రీలంక, పాకిస్థాన్ మ్యాచ్ ఎంత ఆసక్తికరంగా మారిందో తెలిసిందే. పాకిస్థాన్ సెమీస్ ఆశలపై శ్రీలంక నీళ్లు చల్లింది. మొదటి ఇన్నింగ్స్ చూస్తే పాక్ తప్పకుండా సెమీస్కు క్వాలిఫై అవుతుందని దాదాపు అందరూ భావించారు. కానీ.. శ్రీలంక ప్లేయర్స్ తమతో పాటు పాకిస్థాన్ను సైతం ఇంటికి తీసుకెళ్లారు. ఈ మ్యాచ్ అనంతరం.. కెప్టెన్ సల్మాన్ అఘాపై తీవ్ర విమర్శలు వచ్చాయి. అఘా అసలు టీ20 ఆటగాడే కాదని సొంత దేశస్థులే వ్యాఖ్యానిస్తున్నారు. మాజీ వికెట్కీపర్ బ్యాటర్…