Asim Munir: పాకిస్థాన్లో నిశ్శబ్ద తిరుగుబాటు జరుగుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. వాస్తవానికి దాయాది దేశంలో ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ రాజ్యాంగ సవరణ ద్వారా తన అధికారాన్ని విపరీతంగా పెంచుకోడానికి ప్లాన్ చేశారు. పాకిస్థాన్లో 27వ రాజ్యాంగ సవరణ ద్వారా మునీర్ తన పనిని సాధించడానికి ప్రయత్నిస్తున్నది “నిశ్శబ్ద తిరుగుబాటు” కంటే తక్కువ కాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ సవరణ ఆయనకు జీవితకాల హోదా, అధికారాలు, చట్టపరమైన చర్యల నుంచి శక్తిని ఇవ్వడమే కాకుండా, మూడు సాయుధ…