పాకిస్థాన్ యుద్ధానికి సిద్ధమవుతోంది? పహల్గావ్ ఉగ్రవాద దాడిలో 26 మంది పర్యాటకుల మరణం అనంతరం జమ్మూకశ్మీర్ సరిహద్దులో విస్తృతమైన పాకిస్థాన్ కార్యకలాపాలు చేస్తోందని వదంతులను ప్రచారం చేస్తున్నారు. పాకిస్థాన్ వైమానిక దళానికి చెందిన విమానాలు సరిహద్దు సైనిక స్థావరం వైపు వెళుతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. పాకిస్థాన్ సరిహద్దు వెంబడి పెద్ద ఎత్తున సైన్యాన్ని మోహరిస్తోందని సోషల్ మీడియాలో చర్చ మొదలైంది.