CM YS Jagan: సూడాన్లో చిక్కుకున్న తెలుగువారు.. రప్పించేందుకు చర్యలపై సీఎం ఆదేశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM YS Jagan: సూడాన్లో చిక్కుకున్న తెలుగు వారిని సురక్షితంగా వెనక్కి రప్పించేందుకు చర్యలు చేపట్టాలంటూ అధికారులను ఆదేశించారు సీఎం వైఎస్ జగన్.. వారు స్వస్థలాలకు చేరేంతవరకూ అండగా నిలవాలని స్పష్టం చేశారు.. దీని కోసం కేంద్ర ప్రభుత్వ అధికారులతో సమన్వయం చేసుకోవాలన్నారు. సురక్షితంగా వెనక్కి రప్పించేందుకు తగిన చర్యలు చేపట్టాలన్నారు. స్వదేశానికి రాగానే వారిని స్వస్థలాలకు పంపించేందుకు ఏర్పాట్లు చేయాలి.. విమాన టిక్కెట్లు, ప్రయాణ సౌకర్యాలు ఏర్పాటు చేయాలని.. ఎయిర్పోర్టులో రిసీవ్ చేసుకుని వారి స్వస్థలాలకు చేరుకునే వరకు అండగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. కాగా, సుడాన్లో ఇప్పటి వరకు సుమారు 56 మంది తెలుగువారు ఉన్నట్టు అంచనా వేస్తున్నారు..
కాగా, సూడాన్లో అంతర్యుద్ధం జరుగుతోంది. పారామిలిటరీ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్(ఆర్ఎస్ఎఫ్), ఆర్మీకి మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరులో వందలాది మంది పౌరులు చినిపోయారు.. వేలాది మంది గాయపడ్డారు. దీంతో ప్రపంచ దేశాలు తమ పౌరులు, దౌత్య సిబ్బందిని వీలైనంత త్వరగా యుద్ధభూమి నుంచి తరలిస్తున్నాయి. ఆదివారం తెల్లవారుజామునే తమ ఎంబసీ అధికారులను అమెరికా మిలిటరీ ఎయిర్లిఫ్ట్ చేసింది. తమ ఎంబసీ ఉద్యోగులు, పౌరులు, మిత్ర దేశాలకు చెందిన పౌరులను తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఫ్రాన్స్, గ్రీస్, ఇతర యూరోపియన్ దేశాలు ప్రకటించాయి. ఇక, సూడాన్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి రప్పించేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయి.. అందులో భాగంగా భారతదేశం మంగళవారం సూడాన్ ఆన్బోర్డ్ నావికా నౌక INS సుమేధ నుండి 278 మందిని తొలి దశలో స్వదేశానికి తీసుకొచ్చింది.. సుడాన్ నుండి సుమారు 3,000 మంది భారతీయులను తరలించడానికి ప్రారంభించబడిన న్యూఢిల్లీ మిషన్ ‘ఆపరేషన్ కావేరీ’ కింద ఎక్కువ మందిని తిరిగి తీసుకురావడానికి భారత నావికాదళానికి చెందిన రెండవ నౌక INS టెగ్ పోర్ట్ సూడాన్కు చేరుకుందని అధికారులు తెలిపారు.
Also Read
- Byreddy Siddharth Reddy: “నన్ను తిట్టేవారికి బహుమతులు ఇస్తున్నారు”.. మంత్రి టీజీ భరత్పై బైరెడ్డి విమర్శలు..
- Iran: భారీ ఆదాయం సమకూర్చుకునే పనిలో ఇరాన్.. వాటిపై ‘డిజిటల్ టాక్స్’ వసూలుకు ప్లాన్..
- Ambati Rambabu: పెట్రో ధరలపై రిక్షా తొక్కి అంబటి నిరసన.. రెడ్ బుక్ నా మీదే కాదు.. జనసేన వాళ్లపై కూడా అమలు..!
- Virat Kohli: కోహ్లీ ‘స్టంప్ మైక్’ సీక్రెట్ లీక్.. పంజాబ్ను దెబ్బకొట్టిన ఆర్సీబీ వ్యూహం.. ప్లేఆఫ్స్ వేళ సరికొత్త చర్చ..
సూడాన్ నుండి భారతీయులను సులభతరం చేయడానికి సౌదీ అరేబియాలోని జెడ్డా నగరంలో భారత్ కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసింది. తరలింపు మిషన్ను పర్యవేక్షించేందుకు విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి మురళీధరన్ జెడ్డా చేరుకున్నారు. ఆపరేషన్ కావేరిలో చిక్కుకుపోయిన భారతీయుల మొదటి బ్యాచ్ సూడాన్ నుండి బయలుదేరింది. 278 మంది వ్యక్తులతో INS సుమేధ జెడ్డాకు పోర్ట్ సుడాన్ నుండి బయలుదేరింది అని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి ట్వీట్ చేశారు.
తాజావార్తలు
-
Explainer: పిడుగులు చంపుతున్నాయ్.. తెలుగు రాష్ట్రాలకు డేంజర్ అలెర్ట్!
-
Seyon: కమల్ హాసన్ నిర్మాణంలో శివకార్తికేయన్ మాస్ అవతార్
-
Byreddy Siddharth Reddy: “నన్ను తిట్టేవారికి బహుమతులు ఇస్తున్నారు”.. మంత్రి టీజీ భరత్పై బైరెడ్డి విమర్శలు..
-
IPL 2026: ఐపీఎల్ ప్లేఆఫ్స్ షెడ్యూల్ మారుతుందా? బీసీసీఐ, కేంద్రం ఆదేశాలపై ఉత్కంఠ!
-
Iran: భారీ ఆదాయం సమకూర్చుకునే పనిలో ఇరాన్.. వాటిపై ‘డిజిటల్ టాక్స్’ వసూలుకు ప్లాన్..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..