ఒక దేశం-ఒకే భాష నినాదంపై తమిళనాడు సీఎం సీరియస్ అయ్యారు. అయితే.. హిందీ భాషను బలవంతంగా రుద్దాలని కేంద్రం ప్రయత్నిస్తుందని , ఒక దేశం, ఒకే భాష, ఒకే సంస్కృతి వంటివి దేశానికి శత్రువులని, అలాంటి దుష్ట శక్తులకు దేశంలో తావులేదన్నారు. తమిళనాడులో ‘ఇండియా ఎట్ 75 మనోరమా న్యూస్ కాంక్లేవ్ 2022’ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన కేంద్ర ప్రభుత్వ వైఖరిపై విమర్శలు చేశారు. విలేఖరులను అరెస్టు చేయడం.. కేంద్ర దర్యాప్తు సంస్థలను అడ్డుపెట్టుకుని ప్రతిపక్షాలపై దాడులు…