రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత జట్టు మూడు మ్యాచ్ల వన్డేల సిరీస్లో ఇంగ్లాండ్ను వైట్వాష్ చేసింది. బుధవారం జరిగిన మూడో మ్యాచ్లో భారత్ ఇంగ్లాండ్ను 142 పరుగుల తేడాతో ఓడించింది. 357 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించే క్రమంలో ఇంగ్లండ్.. 34.2 ఓవర్లలో 214 పరుగులకు ఆలౌట్ అయింది.