IND vs ENG: ఇండియా విక్టరీ.. ఇంగ్లండ్ను క్లీన్ స్వీప్ చేసిన భారత్
- భారత్ ఘన విజయం
- 142 పరుగుల తేడాతో గెలుపు
- 34.2 ఓవర్లలో 214 పరుగులకు ఇంగ్లండ్ ఆలౌట్
- ఇంగ్లండ్ను క్లీన్ స్వీప్ చేసిన భారత్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత జట్టు మూడు మ్యాచ్ల వన్డేల సిరీస్లో ఇంగ్లాండ్ను వైట్వాష్ చేసింది. బుధవారం జరిగిన మూడో మ్యాచ్లో భారత్ ఇంగ్లాండ్ను 142 పరుగుల తేడాతో ఓడించింది. 357 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించే క్రమంలో ఇంగ్లండ్.. 34.2 ఓవర్లలో 214 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో.. 3-0 తేడాతో వన్డే సిరీస్ను భారత్ క్లీన్ స్వీప్ చేసింది. ఈ మ్యాచ్లో టీమిండియా ఆటగాళ్లు శుభ్మాన్ గిల్ (112), శ్రేయాస్ అయ్యర్ (78) పరుగులతో రాణించడంతో భారత జట్టు భారీ స్కోరు చేసి ఇంగ్లండ్ ముందు ఉంచింది. దీంతో.. భారత్ అలవోక విజయం సాధించింది. ఛాంపియన్స్ ట్రోఫీ ముందు భారత్కు ఈ సిరీస్ గెలవడం మంచి ఎనర్జీని ఇస్తుంది. వన్డే సిరీస్ తో పాటు టీ20 సిరీస్ ను కూడా భారత్ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే…
Read Also: INDIA Alliance: ఇండియా కూటమిలో మరో ముసలం.. రసవత్తరంగా ‘‘మహా’’ రాజకీయం..
Also Read
- Hyderabad: హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకం ఫోర్జరీ.. 8 కాలేజీలకు ఫేక్ ఫైర్ NOCలు
- TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
- Ishan Kishan: మైదానంలో సిక్సర్ల కింగ్.. బ్యాంకులో సర్కారీ నౌకరీ.. బిజీ క్రికెట్ లైఫ్లోనూ ఉద్యోగ బాధ్యతలు
- 115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!
357 రన్స్ టార్గెట్తో బరిలోకి దిగిన ఇంగ్లండ్ జట్టు.. ఆరంభంలో బాగానే రాణించింది. 6.2 ఓవర్లలో 60 పరుగులు చేసింది. అనంతరం.. అర్ష్దీప్ సింగ్ తొలి వికెట్ తీశాడు. ఫిల్ సాల్ట్ను (23) ఔట్ చేసిన కాసేపటికే.. బెన్ డకెట్ (34), టామ్ బెంటన్ (38) పెవిలియన్ బాట పట్టారు. ఆ తర్వాత జో రూట్ (24) కాసేపు పోరాడాడు. చివరలో గస్ అట్కిసన్ (38) పరుగులతో ఒంటరి పోరాటం చేశాడు. టీమిండియా బౌలర్లలో అర్ష్దీప్ సింగ్, హర్షిత్ రాణా, అక్షర్ పటేల్, హార్ధిక్ పాండ్యా తలో 2 వికెట్లు పడగొట్టారు. వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవో చెరో వికెట్ సంపాదించారు.
Read Also: Skoda kylaq: స్కోడా కైలాక్ సంచలనం.. జనవరిలో1,242 యూనిట్ల విక్రయం..
అంతకుముందు బ్యాటింగ్ చేసిన భారత్ భారీ స్కోరు చేసింది. నిర్ణీత 50 ఓవర్లలో 10 వికెట్లు కోల్పోయి 356 పరుగులు చేసింది. శుభ్మన్ గిల్ (112) శతకం సాధించాడు. 102 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్సులు బాదాడు. ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్ (78) హాఫ్ సెంచరీ చేశాడు. 64 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సులు కొట్టాడు. మరోవైపు..ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ (52) అర్ధ శతకంతో రాణించాడు. కేఎల్ రాహుల్ (40) పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. ఇంగ్లండ్ బౌలింగ్లో అత్యధికంగా ఆదిల్ రషీద్ 4 వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత మార్క్ ఉడ్ 2 వికెట్లు తీశాడు. సాకిబ్ మహముద్, గస్ అట్కిసన్, జో రూట్ తలో వికెట్ సంపాదించారు.
తాజావార్తలు
-
Hyderabad: హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకం ఫోర్జరీ.. 8 కాలేజీలకు ఫేక్ ఫైర్ NOCలు
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
Aishwarya Rajesh : ఫ్లాప్లతో డీలా పడిన ఐశ్వర్య రాజేశ్.. పెరిగిన రెమ్యునరేషన్ కష్టాలు
-
Naagin: కోరికలు తీర్చే నాగినిగా శ్రద్ధా కపూర్… ఆరేళ్ల తర్వాత మళ్లీ కదిలిన ‘ఇచ్ఛాధారి నాగిన్’..
-
PM Modi: “మార్క్ జుకర్బర్గ్ ప్రధాని మోడీకి క్షమాపణ చెప్పాలి, లేకపోతే…” మెటా సీఈఓకు పార్లమెంటరీ ప్యానెల్ అల్టిమేటం?
ట్రెండింగ్
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్గా వీవీఎస్ లక్ష్మణ్?
-
Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!
-
Ajit Agarkar-BCCI: అజిత్ అగార్కర్ పదవికి ఎసరు?.. రోహిత్ శర్మనే కారణం!