Mangoes stolen: ఒక్కోసారి ఆన్ లైన్ పోస్టులతో ఫేమస్ అవ్వడమే కాదు. దొంగతనాలు కూడా జరుగుతాయని ఈ ఘటన నిరూపించింది. ఏకంగా రైతు లక్షల్లో నష్టపోవాల్సి వచ్చింది. అంతర్జాతీయ మార్కెట్ లో కిలోకి రూ.2.5 లక్షల విలువైన మామిడి పండ్లు దొంగతనానికి గురయ్యాయి. తోటలోకి ప్రవేశించిన దొంగలు తెల్లారే సరికి మామిడిని చోరీ చేశారు. ఈ ఘటన ఒడిశాలోని నువాపాడా జిల్లాలో జరిగింది.