హైదరాబాద్లో కుల గణన ప్రక్రియ కొనసాగుతుంది. ఎన్యూమరేటర్లు ఇంటింటికి వెళ్లి సర్వే చేస్తున్నారు. కాగా.. సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే సమర్థవంతంగా నిర్వహించేందుకు నోడల్ ఆఫీసర్లను నియమించింది ప్రభుత్వం. జీహెచ్ఎంసీ పరిధిలో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను సమర్ధవంతంగా నిర్వహించేందుకు జీహెచ్ఎంసీ సిద్ధమైంది. 30 సర్కిళ్లకు 10 మంది నోడల్ ఆఫీసర్లను నియమిస్తూ.. వారి కింద మూడు సర్కిళ్ల చొప్పున వీరికి బాధ్యతలను అప్పగించింది జీహెచ్ఎంసీ.