తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఆప్తమిత్రురాలు, అన్నాడీఎంకే మాజీ నాయకురాలు వి.కె. శశికళ మళ్లీ రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించేందుకు సిద్ధమవుతున్నారు. 2026 అసెంబ్లీ ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని ఆమె తన వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఇందులో భాగంగా చెన్నైలోని తన నివాసంలో గత కొన్ని రోజులుగా జిల్లా స్థాయి నేతలు, అనుచరులతో ఆమె వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. తన ఆప్తమిత్రురాలు జయలలిత జయంతి రోజైన ఫిబ్రవరి 24న శశికళ తన కొత్త రాజకీయ పార్టీ పేరు,…