వారానికి నాలుగు రోజులో పని చేయిస్తే మాత్రం.. ఉద్యోగుల వేతనం, పీఎఫ్ వాటా, పని సమయం, వీక్లీ ఆఫ్లు లాంటి విషయాల్లో మార్పులు జరగనున్నాయి.. భారత ప్రభుత్వం దీనిపై కొత్త కార్మిక చట్టాలకు సంబంధించిన సమాచారాన్ని విడుదల చేసింది.
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త కార్మిక చట్టాలను జూలై 1 నుంచి అమలు చేయాలని యోచిస్తోంది. కొత్త లేబర్ చట్టాల ప్రకారం ఉద్యోగుల జీతం, ప్రావిడెంట్ ఫండ్, వీక్లీ ఆఫ్స్ ఇలా అన్నింటిపై ప్రభావం పడనుంది. కొత్త లేబర్ చట్టాల ప్రకారం.. రోజూవారీ పని గంటలు పెరగడంతో పాటు ఉద్యోగుల హోం టేకింగ్ సాలరీ తగ్గి, పీఎఫ్ కాంట్రిబ్యూషన్ పెరగనుంది. ఇదిలా ఉంటే కొన్ని రాష్ట్రాలు, కేంద్ర తీసుకువచ్చిన నాలుగు కార్మిక చట్టాల కింద నిబంధనలను రూపొందించ…