హైదరాబాద్ రాడిసన్ పబ్ ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు బంజారాహిల్స్ సర్కిల్ ఇన్స్పెక్టర్ను సీపీ సీవీ ఆనంద్ సస్పెండ్ చేశారు. ఈ నేపథ్యంలో బంజారాహిల్స్ పీఎస్కు నూతన ఇన్స్పెక్టర్గా నాగేశ్వరరావును నియమించారు. ప్రస్తుతం ఆయన నార్త్జోన్ టాస్క్ఫోర్స్ ఇన్ స్పెక్టర్గా పనిచేస్తున్నారు. పబ్లో ఆయన టీమ్ డెకాయ్ ఆపరేషన్ చేసి డ్రగ్స్ వ్యహారాన్ని బట్టబయలు చేసినట్లు తెలుస్తోంది. నాగేశ్వరరావుపై గతంలో ఎన్నో సంచలన కేసులు ఛేదించిన రికార్డ్ కూడా ఉంది. ఇప్పటికే నిర్లక్ష్యం వహించిన ఇన్స్పెక్టర్ శివచంద్రను సీపీ…