Supreme Court: భర్తల పొట్టకొట్టొద్దు.. భార్యల తీరుపై సుప్రీంకోర్టు కామెంట్స్..
- భర్త పనిచేసే సంస్థలకు భార్య ఫిర్యాదులు చేయడంపై సుప్రీం ఆందోళన..
- వైవాహిక వివాదాల కేసులపై కీలక వ్యాఖ్యలు..
- ఇలా చేస్తే భర్త జీవనోపాధిని దెబ్బతీయడమే అవుతుందని వ్యాఖ్య..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Supreme Court: భర్తలు ఉద్యోగాలు కోల్పేయేలా భార్యలు ప్రవర్తిస్తుండటంపై సుప్రీంకోర్ట్ ఆందోళన వ్యక్తం చేసింది. వైవాహిక వివాదాల నేపథ్యంలో కొందరు మహిళలు భర్తలు పనిచేసే సంస్థలకు ఫిర్యాదు చేయడాన్ని అత్యున్నత కోర్టు తప్పుపట్టింది. ఇది చివరకు భర్తలు ఉద్యోగం కోల్పోయేలా చేస్తుందని, చివరకు భరణంపై ప్రభావం చూపొచ్చని వ్యాఖ్యానించింది. అస్సాంలో నమోదైన పరువునష్టం కేసును ఉత్తర్ ప్రదేశ్కు బదిలీ చేయాలని కోరుతూ మహిళ దాఖలు చేసిన పిటిషన్ను జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఆర్. మహాదేవన్ల ధర్మాసనం విచారణ చేసింది.
తన భర్తతో ఇప్పటికే ఘజియాబాద్లో పలు కేసులు నడుస్తున్నందున, పరువు నష్టం కేసును కూడా అక్కడికే బదిలీ చేయాలని మహిళ కోర్టును కోరింది. విచారణ సందర్భంగా జస్టిస్ నాగరత్న మాట్లాడుతూ.. ఇటీవల కాలంలో చాలా మంది భార్యలు భర్త పనిచేసే సంస్థలకు ఫిర్యాదు చేయడం ఒక ధోరణిగా మారిందని అన్నారు. ఇలాంటి ఫిర్యాదుల వల్ల భర్త ఉద్యోగం కోల్పేయే అవకాశం ఉందని పేర్కొన్నారు.
Also Read
- Ind-Pak: మరోసారి సముద్ర వివాదం.. నౌక ఢీకొనడంపై పాక్ వాదనను ఖండించిన భారత్
- Supreme Court: పరీక్షా సంస్కరణలపై సుప్రీంకోర్టు విచారణ.. ఎన్టీఏ ఆఫీస్ను సందర్శించే అవకాశం
- Mamata Banerjee: అభ్యర్థి ఔట్.. కాంగ్రెస్కు మమత మద్దతు: బెంగాల్ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్..
- PM Modi: నిరుద్యోగులకు శుభవార్త.. రేపు 51 వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందించనున్న మోడీ
విడాకులు కోరడం ఒక విషయం, కానీ జీవిత భాగస్వామి జీవనోపాధినే కోల్పోయేలా చేయడం మరింత తీవ్రమైన విషయం అని జస్టిస్ నాగరత్న వ్యాఖ్యానించారు. ఈ కేసులో మహిళ, తన భర్త ఇండియన్ ఎయిర్ఫోర్స్ అధికారి అయినప్పటికీ సేవా నియమాలకు విరుద్ధంగా వ్యక్తిగత వ్యాపారం నిర్వహిస్తుున్నారని ఎయిర్ఫోర్స్ అధికారులకు ఫిర్యాదు చేసింది. దీనిపై భర్త స్నేహితుడు ఆమెపై పరువునష్టం కేసు దాఖలు చేశారు.
మహిళ తరుఫు న్యాయవాది వాదిస్తూ.. ఆమె భర్త ముందుగా తప్పుడు ఫిర్యాదు చేశాడని, ఎయిర్ఫోర్స్కు చెందిన హెల్మెట్ను ఆమె, ఆమె సోదరుడు దొంగిలించారని ఆరోపించారని తెలిపారు. ఆ హెల్మెట్ వివరాలు తెలుసుకునేందుకే ఎయిర్ఫోర్స్ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు కోర్టుకు వివరించారు. అన్ని వాదనలు విన్న సుప్రీంకోర్టు, ఈ కేసులో రాజీకి అవకాశం ఉందేమో అని పరిశీలించాలని సుప్రీంకోర్టు మధ్యవర్తిత్వ కేంద్రానికి పంపింది. అన్ని ఆరోపణలు విరమించుకుని వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించుకోవాలని మహిళకు సూచించింది.
తాజావార్తలు
-
Ind-Pak: మరోసారి సముద్ర వివాదం.. నౌక ఢీకొనడంపై పాక్ వాదనను ఖండించిన భారత్
-
Pakistan: ‘‘ఎంతవరకైనా వెళ్తాం’’.. సౌదీకి పాక్ హామీ..
-
Travis Head-Abhishek: కాటేరమ్మ కొడుకుల విశ్వరూపం.. ఇటు అభిషేక్, అటు ట్రావిస్ హెడ్.. బాదుడే బాదుడు..
-
Viswanath & Sons : నెట్ఫ్లిక్స్ను ఊపేస్తున్న సూర్య సినిమా.. ఇండియాలో నెం.1.. గ్లోబల్గా టాప్-3!
-
Smart Phone: 6000mAh బ్యాటరీ, 18W ఫాస్ట్ ఛార్జింగ్, 90Hz డిస్ప్లే , 12GB ర్యామ్.. మార్కెట్లోకి కొత్త ఫోన్..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్పై భారత్ ఘన విజయం.. సెమీస్కు దూసుకెళ్లిన హర్మన్సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..