Nirmala Sitharaman: 2025 కేంద్ర బడ్జెట్లో ఆదాయ పన్నుల ప్రకటనలు, రిబేట్ సీలింగ్ రూ. 7 లక్షల నుంచి రూ. 12 లక్షలకు పెంచడాన్ని ప్రస్తావించిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. బడ్జెట్ ప్రజల గొంతును వినిపించిందని అన్నారు. శనివారం బడ్జెట్ ప్రసంగం తర్వాత ఆమె మీడియాతో మాట్లాడుతూ, ఈ వ్యాఖ్యలు చేశారు.
యూనియన్ బడ్జెట్ 2025-26 ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ లో అందరి దృష్టి ఆదాయపన్నుపైనే ఉంది. ఇన్ కం ట్యాక్స్ ఎంత విధిస్తారు? కొత్త పన్ను శ్లాబులు ఎలా ఉంటాయి? అని చర్చలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో నిర్మలా సీతారామన్ కొత్త ఆదాయ పన్ను శ్లాబులను ప్రకటించింది. మధ్య తరగతి వేతన జీవులకు బిగ్ రిలీఫ్ ను ఇచ్చింది. ఇప్పటి వరకు రూ. 7 లక్షల వార్షిక ఆదాయం ఉన్న…