Nirmala Sitharaman: ‘‘ఈ బడ్జెట్ ప్రజల గొంతుని వినిపించింది’’: ఆర్థిక మంత్రి..
- ఈ బడ్జెట్ ప్రజల గొంతుని వినిపించింది..
- టాక్స్ స్లాబుల్ని వివరించిన నిర్మలా సీతారామన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nirmala Sitharaman: 2025 కేంద్ర బడ్జెట్లో ఆదాయ పన్నుల ప్రకటనలు, రిబేట్ సీలింగ్ రూ. 7 లక్షల నుంచి రూ. 12 లక్షలకు పెంచడాన్ని ప్రస్తావించిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. బడ్జెట్ ప్రజల గొంతును వినిపించిందని అన్నారు. శనివారం బడ్జెట్ ప్రసంగం తర్వాత ఆమె మీడియాతో మాట్లాడుతూ, ఈ వ్యాఖ్యలు చేశారు. రిబేట్ పెంపు కారణంగా ఒక కోటి మంది పన్ను చెల్లింపుదారులు, ఆదాయపు పన్ను చెల్లించరని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. ‘‘మాది స్పందించే ప్రభుత్వమని, ఫలితంగా జూలైలో నేను ప్రకటించిన ఆదాయపు పన్ను సరళీకరణ ఇప్పటికి పూర్తయింది. మేము వచ్చే వారం బిల్లును తీసుకువస్తాము. కాబట్టి పన్నులతో సహా సంస్కరణల గురించి పని పూర్తి చేశాం’’ అని ఆర్థిక మంత్రి అన్నారు.
Read Also: Rahul Gandhi: ‘‘ బుల్లెట్ గాయాలకు బ్యాండ్ ఎయిడ్ ’’.. బడ్జెట్పై రాహుల్ గాంధీ విమర్శలు..
Also Read
- Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
- Ketan Murder Case: "ఒక్క మాట చెబితే పెళ్లి ఆపేవాళ్లం".. కూతురు ఘాతుకంపై తల్లిదండ్రుల కన్నీటిపర్యంతం!
- Muskan Pradhan: తాగొచ్చిన వరుడికి చెంపదెబ్బ.. ఇప్పుడు మహిళలకు మార్గదర్శి! కౌన్సెలర్గా నియమితురాలైన ముస్కాన్
- Operation Sindoor: ‘ఆపరేషన్ సిందూర్’ అమరవీరుల పేర్లు ఇవే.. దేశం కోసం ప్రాణాలర్పించిన ఆరుగురు వీరులు!
పన్ను స్లాబులను విమరించేందుకు నిర్మలా సీతారామన్ రెండు ఉదాహరణలను చెప్పారు. రూ. 12 లక్షల వరకు సంపాదించే వారు ఎలాంటి ఆదాయపు పన్ను చెల్లించరు. ఇది మునుపటి నిర్మాణం నుంచి గణనీయమైన మార్పుని సూచిస్తుంది. గతంలో వారు రూ. 60,000 నుంచి రూ. 80,000 మధ్య చెల్లించాల్సి వచ్చేది. రూ. 8 లక్షలు సంపాదించే వ్యక్తులు 2024-25 పన్నుల ప్రకారం రూ. 30,000 చెల్లించారు. ప్రస్తుతం పన్ను స్లాబుల్లో మార్పుల వల్ల వారు రూ. 20,000 మాత్రమే చెల్లిస్తారని, రూ. 10,000 పొదుపు అవుతుందని చెప్పారు.
సవరించిన కొత్త పన్ను స్లాబులు అధిక సంపాదనదారులకు కూడా ప్రయోజనం చేకూరుస్తుందని ఆమె అన్నారు. ఉదాహరణకు రూ. 24 లక్షలు అంతకన్నా ఎక్కువ సంపాదించే వ్యక్తులు పాత వ్యవస్థ కింద కనీసం రూ. 4.1 లక్షలు పన్నులు చెల్లిస్తారని, సవరించిన దాని ప్రకారం.. వారు రూ. 3 లక్షలు మాత్రమే చెల్లించాల్సి ఉంటుందని, అంటే రూ. 1.1 లక్షల్ని పొదుపు చేసుకోవచ్చని అన్నారు. ఫలితంగా పన్ను స్లాబుల పునర్నిర్మాణం ద్వారా మధ్యతరగతి వినియోగదారుల చేతుల్లోకి గణనీయమైన డబ్బు చేరుతుందని చెప్పారు. సీనియర్ సిటిజన్లకు పన్ను మినహాయింపు పరిమితిని రూ. 1 లక్షకు రెట్టింపు చేస్తామని అన్నారు.
తాజావార్తలు
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
Vaibhav Sooryavanshi Debut: ఎంతో ప్రతిభ ఉన్నా.. వైభవ్ సూర్యవంశీకి అరంగేట్రం చేసే అర్హత ఉందా?
-
Ketan Murder Case: “ఒక్క మాట చెబితే పెళ్లి ఆపేవాళ్లం”.. కూతురు ఘాతుకంపై తల్లిదండ్రుల కన్నీటిపర్యంతం!
-
Muskan Pradhan: తాగొచ్చిన వరుడికి చెంపదెబ్బ.. ఇప్పుడు మహిళలకు మార్గదర్శి! కౌన్సెలర్గా నియమితురాలైన ముస్కాన్
-
Asha Bhosle : ఆశా భోస్లేకు బ్రిటిష్ బ్యాండ్ గొరిల్లాజ్ ఘన నివాళి.. లండన్ స్టేడియంలో భావోద్వేగ క్షణాలు
ట్రెండింగ్
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!
-
BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..
-
Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!