Nirmala Sitharaman: ‘‘ఈ బడ్జెట్ ప్రజల గొంతుని వినిపించింది’’: ఆర్థిక మంత్రి..
- ఈ బడ్జెట్ ప్రజల గొంతుని వినిపించింది..
- టాక్స్ స్లాబుల్ని వివరించిన నిర్మలా సీతారామన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nirmala Sitharaman: 2025 కేంద్ర బడ్జెట్లో ఆదాయ పన్నుల ప్రకటనలు, రిబేట్ సీలింగ్ రూ. 7 లక్షల నుంచి రూ. 12 లక్షలకు పెంచడాన్ని ప్రస్తావించిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. బడ్జెట్ ప్రజల గొంతును వినిపించిందని అన్నారు. శనివారం బడ్జెట్ ప్రసంగం తర్వాత ఆమె మీడియాతో మాట్లాడుతూ, ఈ వ్యాఖ్యలు చేశారు. రిబేట్ పెంపు కారణంగా ఒక కోటి మంది పన్ను చెల్లింపుదారులు, ఆదాయపు పన్ను చెల్లించరని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. ‘‘మాది స్పందించే ప్రభుత్వమని, ఫలితంగా జూలైలో నేను ప్రకటించిన ఆదాయపు పన్ను సరళీకరణ ఇప్పటికి పూర్తయింది. మేము వచ్చే వారం బిల్లును తీసుకువస్తాము. కాబట్టి పన్నులతో సహా సంస్కరణల గురించి పని పూర్తి చేశాం’’ అని ఆర్థిక మంత్రి అన్నారు.
Read Also: Rahul Gandhi: ‘‘ బుల్లెట్ గాయాలకు బ్యాండ్ ఎయిడ్ ’’.. బడ్జెట్పై రాహుల్ గాంధీ విమర్శలు..
Also Read
- PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
- PM Modi: నెదర్లాండ్స్ రాజు, రాణితో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు
- Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
- Silver: బంగారం తర్వాత ఇప్పుడు వెండి.. కేంద్రం కీలక నిర్ణయంతో పెరగనున్న ధరలు..
పన్ను స్లాబులను విమరించేందుకు నిర్మలా సీతారామన్ రెండు ఉదాహరణలను చెప్పారు. రూ. 12 లక్షల వరకు సంపాదించే వారు ఎలాంటి ఆదాయపు పన్ను చెల్లించరు. ఇది మునుపటి నిర్మాణం నుంచి గణనీయమైన మార్పుని సూచిస్తుంది. గతంలో వారు రూ. 60,000 నుంచి రూ. 80,000 మధ్య చెల్లించాల్సి వచ్చేది. రూ. 8 లక్షలు సంపాదించే వ్యక్తులు 2024-25 పన్నుల ప్రకారం రూ. 30,000 చెల్లించారు. ప్రస్తుతం పన్ను స్లాబుల్లో మార్పుల వల్ల వారు రూ. 20,000 మాత్రమే చెల్లిస్తారని, రూ. 10,000 పొదుపు అవుతుందని చెప్పారు.
సవరించిన కొత్త పన్ను స్లాబులు అధిక సంపాదనదారులకు కూడా ప్రయోజనం చేకూరుస్తుందని ఆమె అన్నారు. ఉదాహరణకు రూ. 24 లక్షలు అంతకన్నా ఎక్కువ సంపాదించే వ్యక్తులు పాత వ్యవస్థ కింద కనీసం రూ. 4.1 లక్షలు పన్నులు చెల్లిస్తారని, సవరించిన దాని ప్రకారం.. వారు రూ. 3 లక్షలు మాత్రమే చెల్లించాల్సి ఉంటుందని, అంటే రూ. 1.1 లక్షల్ని పొదుపు చేసుకోవచ్చని అన్నారు. ఫలితంగా పన్ను స్లాబుల పునర్నిర్మాణం ద్వారా మధ్యతరగతి వినియోగదారుల చేతుల్లోకి గణనీయమైన డబ్బు చేరుతుందని చెప్పారు. సీనియర్ సిటిజన్లకు పన్ను మినహాయింపు పరిమితిని రూ. 1 లక్షకు రెట్టింపు చేస్తామని అన్నారు.
తాజావార్తలు
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
-
Story Board : మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
-
Off The Record : మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..