NEET 2023: వైద్య కళాశాలల్లో అడ్మిషన్ కోసం దేశంలోనే అతిపెద్ద జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష (NEET UG 2023) నేడు (మే 7) దేశవ్యాప్తంగా 499 నగరాల్లో 4000 పరీక్షా కేంద్రాల్లో జరగనుంది. ఇందులో 20 లక్షల 86 వేల మంది విద్యార్థులు పాల్గొంటారు.
దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ యూజీ పరీక్ష ఆదివారం నిర్వహించనున్నారు. పెన్ను, పేపర్ విధానంలో దేశవ్యాప్తంగా 499 నగరాలు,పట్టణాల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.20 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నారు.