NEET 2023: నేడే నీట్ పరీక్ష.. అభ్యర్థులు గుర్తుంచుకోవాల్సిన కీలక విషయాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
NEET 2023: వైద్య కళాశాలల్లో అడ్మిషన్ కోసం దేశంలోనే అతిపెద్ద జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష (NEET UG 2023) నేడు (మే 7) దేశవ్యాప్తంగా 499 నగరాల్లో 4000 పరీక్షా కేంద్రాల్లో జరగనుంది. ఇందులో 20 లక్షల 86 వేల మంది విద్యార్థులు పాల్గొంటారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.20 గంటల వరకు పరీక్ష జరగనుంది. తెలుగుతో పాటు 13 భాషల్లో జరిగే ఈ పరీక్షకు 20 లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరవుతారని అంచనా. ఈ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు నిబంధనలను మరువవద్దని అధికారులు సూచిస్తున్నారు. ఇక మహారాష్ట్రలో గరిష్టంగా 582, యూపీలో 451 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. కాగా.. రాజస్థాన్లోని 24 నగరాల్లో 354 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇక మరోవైపు హింసాత్మకమైన మణిపూర్లో పరీక్ష వాయిదా పడింది. ఆదివారం జరగనున్న దేశంలోనే అతిపెద్ద జాతీయ ప్రవేశ పరీక్షకు సన్నాహాలు పూర్తయినట్లు ఎన్టీఏ డైరెక్టర్ జనరల్ వినీత్ జోషి తెలిపారు. దేశవ్యాప్తంగా 499 నగరాల్లో, విదేశాల్లో 14 నగరాల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. దాదాపు 16 లక్షల 72 వేల 912 మంది విద్యార్థులు ఆంగ్ల మాధ్యమాన్ని పరీక్ష మాధ్యమంగా ఎంచుకున్నారు. కాగా హిందీలో 2 లక్షల 76 వేల 175 మంది అభ్యర్థులు చేసుకున్నారు.
ఇక ఎన్టీఏ డైరెక్టర్ జనరల్ వినీత్ జోషి ఆదేశాల మేరకు పేపర్ సెక్యూరిటీ కోసం అన్ని పరీక్షా కేంద్రాల్లో మొబైల్ జామర్లు, బయోమెట్రిక్ మిషన్లు, ఫ్రిస్కింగ్, మెటల్ డిటెక్టర్లను ఏర్పాటు చేశారు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద భద్రత కోసం పోలీసులు, ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీ సిబ్బందిని కూడా నియమించనున్నారు. ఎన్టీఏ ప్రతి పరీక్షా కేంద్రంలో రిటైర్డ్ ఆర్మీ అధికారులను ఇన్విజిలేటర్లు, సబ్ ఇన్విజిలేటర్లుగా నియమించింది. అన్ని కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. NTA ఢిల్లీ ప్రధాన కార్యాలయం నుండి వీటిని నేరుగా వీక్షించవచ్చు.
Also Read
- Student Success: జేబులో రూ.1,000.. చేతిలో పాత ల్యాప్టాప్.. ఇప్పుడు రూ.3.5 కోట్ల స్కాలర్షిప్..
- Top AI Courses 2026: టెక్ ప్రపంచాన్ని రూల్ చేయబోతున్న టాప్ AI కోర్సులు ఇవే.. మీకు జాబ్ పక్కా!!
- మల్లారెడ్డి గ్రూప్-గూగుల్ భాగస్వామ్యంలో 'Digital Campus on Google Cloud' ప్రారంభం..!
- Arunachal Pradesh: రాత్రిపూట 65 కిలోమీటర్లు నడిచిన 90 మంది బాలికలు.. ఎందుకో తెలుసా...
* నీట్ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు అడ్మిట్ కార్డ్తో పాటు ఏదైనా గుర్తింపు కార్డు మరియు పాస్పోర్ట్ సైజు ఫోటోగ్రాఫ్ని తీసుకెళ్లాలి. హాజరు పత్రంపై ఫోటో అతికించాలి.
* అభ్యర్థులు తప్పనిసరిగా డ్రెస్ కోడ్ పాటించాలి. పొడవాటి చేతుల దుస్తులు, బూట్లు, నగలు మరియు మెటల్ వస్తువులు లోపలికి అనుమతించబడవు.
* స్లిప్పర్లు, తక్కువ ఎత్తున్న శాండిల్స్ మాత్రమే వేసుకోవాలి.
* పేపర్లు, జామెట్రీ/పెన్సిల్ బాక్స్లు, ప్లాస్టిక్ పౌచ్లు, కాలిక్యులేటర్లు, స్కేల్స్, రైటింగ్ ప్యాడ్లు, పెన్ డ్రైవ్లు, ఎలక్ట్రానిక్ పెన్నులు మొదలైనవాటిని పరీక్షా కేంద్రంలోకి అనుమతించరు.
* వాచీలు, పర్సులు, హ్యాండ్ బ్యాగులు, బెల్టులు, టోపీలు మొదలైన వాటిని ధరించవద్దు.
* మొబైల్ ఫోన్లు, బ్లూటూత్, ఇయర్ ఫోన్లు, పేజర్లు, హెల్త్ బ్యాండ్లు, స్మార్ట్ వాచీలు వంటి కమ్యూనికేషన్ పరికరాలను లోపలికి అనుమతించరు. ఎలక్ట్రానిక్ వస్తువులను కూడా తీసుకెళ్లవద్దు.
* పరీక్ష రాసేందుకు అభ్యర్థులకు పరీక్ష గదిలోనే బాల్ పాయింట్ పెన్ను అందజేస్తారు.
Operation Tigers: పల్నాడు అటవీ ప్రాంతంలో ఆపరేషన్ టైగర్స్
తాజావార్తలు
-
Deputy CM Pawan Kalyan: ఎవ్వరినీ వదలని పవన్ కల్యాణ్.. ప్రధాని నుంచి జనసైనికుల వరకు..!
-
OTR: గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో బీజేపీ గేమ్ ప్లాన్ ఏంటి?
-
OTR: తుపాకి వదిలి ప్రజాస్వామ్య బాటలో.. దేవ్ జీ పొలిటికల్ ఎంట్రీపై చర్చ
-
Tukkuguda Nurse Case: తుక్కుగూడ నర్సు కేసులో బిగ్ ట్విస్ట్.. రంగంలోకి జాతీయ మహిళా కమిషన్
-
Story Board: తెలంగాణ కాంగ్రెస్ రాజకీయం ఏ మలుపు తిరుగుతుంది..?
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!