నిర్మాణ రంగంలో ఇప్పటికే ఎన్నో మైలురాళ్లు అందుకున్న మైహోమ్ గ్రూప్ ఛైర్మన్ డాక్టర్ జూపల్లి రామేశ్వరరావును ప్రతిష్టాత్మక పురస్కారం వరించింది. ఆయనకు గురువారం నాడు తెలంగాణ క్రెడాయ్ సంస్థ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును అందజేసింది. హైదరాబాద్ హెచ్ఐసీసీలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ గవర్నర్ సౌందరరాజన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ చేతుల మీదుగా జూపల్లి లైఫ్టైమ్ అచీవ్మెంట్ పురస్కారాన్ని అందుకున్నారు. అనంతరం జూపల్లి రామేశ్వరరావు మాట్లాడుతూ… హైదరాబాద్ నగర ప్రగతిలో కన్స్ట్రక్షన్…