రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తిస్తున్న మునుగోడు ఉప ఎన్నిక ఫలితం మరికొన్ని గంటల్లో వెలువడనుంది. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రరంభమైంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఫలితం తేలిపోనుంది.
అందరిలోనూ ఆసక్తి రేపుతున్న నల్గొండ జిల్లా మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించి అభ్యర్థి ఎంపికపై కాంగ్రెస్ పార్టీ భారీ కసరత్తు ఫలించింది. ఇవాళ మునుగోడు ఉపఎన్నిక అభ్యర్థి పేరును కాంగ్రెస్ ప్రకటించింది. కాంగ్రెస్ మునుగోడు అభ్యర్థిగా పాల్వాయి స్రవంతిని ఎంపికచేసింది. ఢిల్లీకి రాష్ట్ర పీసీసీ నాలుగు పేర్లు పంపించింది. పాల్వాయి స్రవంతి, కృష్ణారెడ్డి, పల్లె రవి, కైలాస్ నేతలు మునుగోడు టికెట్ కోసం పోటీ పడ్డారు. అయితే వీరిలో పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కుమార్తె కాబట్టి అధిష్టానం…
మునుగోడులో బీజేపీ అభ్యర్థిని ఓడించేందుకు ఏ పార్టీకైనా మద్దతు ఇస్తామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రకటించారు. సీపీఐ పార్టీతో చర్చించి అభ్యర్థిని నిలబెట్టే విషయాన్ని ప్రకటిస్తామన్నారు.