గుంటూరు జిల్లా తెనాలిలోని చంద్రబాబు నాయుడు కాలనీలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ప్రభుత్వ స్థలంలో రాత్రికి రాత్రి మేరీ మాత విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. చంద్రబాబు నాయుడు కాలనీలో ప్రభుత్వ స్థలం శుభ్రం చేసి పార్కును ఏర్పాటు చెయ్యాలని ఆలోచనలో మున్సిపల్ అధికారులు ఉన్నారు.
హైదరాబాద్ నగరంలో.. పెంపుడు కుక్క రోడ్డుపై మలవిసర్జన చేస్తే రూ.1000 జరిమానా విధిస్తామని మున్సిపల్ అధికారులు తెలిపారు. మిగతా మున్సిపల్ ప్రాంతాల్లోనూ ఈ జరిమానా అమలు చేయాలని మున్సిపల్ శాఖ కమిషనర్ & డైరెక్టర్ శ్రీదేవి ఆదేశాలు జారీ చేశారు.
గుజరాత్లోని రాజ్కోట్ వీడియో గేమ్జోన్లో అగ్ని ప్రమాదం సంభవించి 28 మంది అగ్నికి ఆహుతైన విషయం తెలిసిందే. చనిపోయిన వారిలో చిన్నారులు ఉండటం, వారంతా తీవ్రంగా కాలిపోవడం అందరినీ కలచివేసింది. ఈ కేసు గుజరాత్ హై కోర్టులో విచారణకు వచ్చింది.