Mumbai Municipal Elections: మహారాష్ట్రలోని 29 మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికల ఫలితాలు రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా జాతీయ రాజకీయల్లో కూడా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. BMCలో అసదుద్దీన్ ఓవైసీ నేతృత్వంలోని AIMIM పార్టీ హవా కొనసాగుతుంది. ముంబై, నాందేడ్ సహా అనేక ముస్లిం ప్రాబల్య ప్రాంతాలలో AIMIM పార్టీ తన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. BMCలో ఇప్పటికే ఈ పార్టీ రెండు స్థానాలను కూడా గెలుచుకుంది. అలాగే నాందేడ్లో 14 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. అహల్యానగర్, చంద్రపూర్ మున్సిపల్ కార్పొరేషన్లలో…
ఆర్థిక రాజధాని ముంబైలో గురువారం మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మహారాష్ట్రలో ముంబైతో పాటు 28 కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగాయి. ఓటర్ల తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమై ఉన్నాయి. శుక్రవారం ఉదయం 10 గంటలకు ఎన్నికల ఫలితాలు విడుదలకానున్నాయి.
ఆర్థిక రాజధాని ముంబైలో గురువారం మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 7:30 గంటలకు ఎన్నికల పోలింగ్ ప్రారంభం కానుంది. ముంబైతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 28 మున్సిపల్ కార్పొరేషన్లో ఎన్నికలు జరగనున్నాయి.
ఆర్థిక రాజధాని ముంబై మున్సిపల్ ఎన్నికలు జనవరి 15న జరగనున్నాయి. ఈ ఎన్నికలు ప్రధానంగా అధికార పార్టీకి చాలా కీలకం. అదే తరుణంలో శివసేన (యూబీటీ)కి కూడా అంతే ప్రాధాన్యం. ఇప్పటికే ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లో భారీ విజయ నమోదు కావడంతో కూటమి ప్రభుత్వం మంచి జోష్లో ఉంది. ముంబైను కూడా సొంతం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేస్తోంది.
ముంబై మున్సిపల్ ఎన్నికలు జనవరి 15న జరగనున్నాయి. ఇందుకోసం అన్ని పార్టీలు సన్నద్ధం అవుతున్నాయి. ఇక ఇటీవల జరిగిన మహారాష్ట్రలోని స్థానిక ఎన్నికల్లో ఇండియా కూటమికి ఎదురుదెబ్బ తగిలింది. సరైన ఫలితాలు రాబట్టలేక చతికిలబడింది.
ఇటీవల జరిగిన మహారాష్ట్ర స్థానిక ఎన్నికల్లో శివసేన (యూబీటీ) ఘోరంగా దెబ్బతింది. దీంతో ఆ పార్టీ అప్రమత్తం అయింది. జనవరిలో జరిగే ముంబై మున్సిపల్ ఎన్నికల్లో అయినా తమ సత్తా చాటుకోవాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో థాక్రే బ్రదర్స్ ఒక్కటయ్యారు.