భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచే సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు (MSMEలు).. ఎగుమతిదారులకు ఊరటనిచ్చే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అనిశ్చిత పరిస్థితులు, పెరుగుతున్న ఇంధన ధరల వల్ల ఇబ్బందులు పడుతున్న వ్యాపారాలకు సహాయం చేయడానికి 3 నుంచి 6 నెలల పాటు రుణ వాయిదాల చెల్లింపు నిలిపివేత (Loan Moratorium) కల్పించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఎందుకు ఈ నిర్ణయం..? ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు…