ప్రధాని మోడీ తెలంగాణపై చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలో తాజాగా పెద్దపల్లి టీఆర్ఎస్ ఎంపీ నేతకాని వెంకటేశ్ మాట్లాడుతూ.. ప్రధాని రాజ్యసభ లో తెలంగాణ ఏర్పాటుకు సంబంధించి అవాస్తవాలను, ఈర్ష్య, ద్వేషాలను కక్కారని ఆయన అన్నారు. ప్రధాని ఇలా మాట్లాడటం సిగ్గు చేటు ఆయన విమర్శించారు. మోడీ వ్యాఖ్యలను టీఆర్ఎస్ ఎంపీలం ఖండిస్తున్నామని ఆయన వెల్లడించారు. బీజేపీ నాయకులు అబద్దాలు చెప్పటం, సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేయటం అలవాటైందన్నారు. గ్లోబెల్స్ ప్రచారంలో మోడీకి…