గత కొన్ని రోజులుగా ఎండలతో అల్లాడుతున్న భాగ్యనగరవాసులకు వరుణుడు ఊరటనిచ్చాడు. సోమవారం మధ్యాహ్నం వరకు భానుడు తన ప్రతాపం చూపినప్పటికీ, మధ్యాహ్నం తర్వాత ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఆకాశం మబ్బుపట్టి చల్లని గాలులు వీచడంతో నగరంలో ఆహ్లాదకరమైన పరిస్థితులు నెలకొన్నాయి. చాలా రోజుల తర్వాత కురిసిన చిరు జల్లులు భాగ్యనగరాన్ని మురిపించాయి. ముఖ్యంగా అబిడ్స్, బషీర్ బాగ్, సైఫాబాద్, ట్యాంక్ బండ్, సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో తేలికపాటి వర్షం కురిసింది. అలాగే మీర్ పేట్, బడంగ్ పేట్…