Monsoon Alert: భారతీయులకు శుభవార్త.. 5 రోజుల ముందే అండమాన్ను తాకనున్న తొలకరి జల్లు
- భారతీయులకు శుభవార్త
- 5 రోజుల ముందే అండమాన్ను తాకనున్న తొలకరి జల్లు
- ఎండ వేడిమి నుంచి ఉపశమనం కలిగించనున్న రుతుపవనాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతీయులకు కేంద్ర వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయం నుంచే సూర్యుడు సుర్రు మంటున్నాడు. బయటకు రావాలంటేనే ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఇలాంటి తరుణంలో ఐఎండీ గుడ్న్యూస్ చెప్పింది.
ఈ ఏడాది నిర్ణీత తేదీ కంటే 5 రోజుల ముందుగానే రుతుపవనాలు భారత్కు రానున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి రుతుపవనాలు వేగంగా భారతదేశం వైపు దూసుకొస్తున్నాయని తెలిపింది. ఈ నేపథ్యంలో నిర్ణీత గడువు కంటే ఐదు రోజుల ముందే అండమాన్ను తొలకరి ముద్దాడనుందని పేర్కొంది. ప్రస్తుతం తీవ్రమైన వేడి గాలులతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు ఇది భారీ ఉపశమనం కలిగించే వార్తగా చెప్పొచ్చు.
Also Read
- Abhijeet Dipke: కాక్రోచ్ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేపై దాడి.. నాలుగు సార్లు చెంపదెబ్బలు
- Kundu couple: దీదీ తృణమూల్ను తుత్తునకలు చేసిన కుందు దంపతులు? ఒక సాదాసీదా పార్టీని లోక్సభలోనే కింగ్ మేకర్గా ఎలా మార్చారు!
- PM Modi: స్లోవేకియాలో మోడీ పర్యటన.. ఇరు దేశాల సంబంధాలపై చర్చ
- PM Modi: అమెరికా-ఇరాన్ ఒప్పందంపై మోడీ కీలక వ్యాఖ్యలు..
ఇదిలా ఉంటే మే నెలలోనే ఉత్తర భారతదేశంలోని అనేక రాష్ట్రాల్లో అకాల వర్షాలు దంచికొడుతున్నాయి. భీకరమైన గాలులతో వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో సాధారణం కంటే ముందుగానే మే 15వ నాటికి అండమాన్-నికోబార్ దీవులను రుతుపవనాలు తాకనున్నాయని ఐఎండీ అంచనా వేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడీనం, తుఫాను కారణంగా రుతుపవనాలు ఊపందుకున్నాయని చెప్పింది.
ఇప్పటికే ఏప్రిల్, మే నెలలో కురిసిన వర్షాలతో వాతావరణం ఆహ్లాదకరంగా మారాయి. హిమాలయాల్లో గాలుల కదలికల నేపథ్యంలో ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ సహా ఉత్తర భారతదేశంలోని చాలా రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. దీనికి తోడు ఇప్పుడు రుతుపవనాలు వేగంగా భారత్ వైపు దూసుకొస్తున్నాయి. ఇదే ఒరవడి కొనసాగితే మాత్రం జూన్ 1 నాటికి రుతుపవనాలు కేరళకు చేరుకోనున్నాయి.
ఐఎండీ అప్డేట్ ప్రకారం… మే 16వ తేదీన బంగాళాఖాతం, అండమాన్ సముద్రంలోని ఇతర ప్రాంతాల నుంచి రుతుపవనాలు మొత్తం ద్వీప సమూహానికి భారీ వర్షాలను తీసుకురావచ్చు. సాధారణంగా రుతుపవనాలు మే 20వ తేదీ నాటికి అండమాన్- నికోబార్ దీవులకు చేరుకుంటాయి. అయితే ఈసారి ఊహించిన సమయం కంటే ఐదు రోజుల ముందే అండమాన్ ప్రాంతాన్ని రుతుపవనాలు తాకడం అన్నదాతలకు గుడ్న్యూస్గా చెప్పొచ్చు. గత సంవత్సరం 2025లో రుతుపవనాలు మే 13వ తేదీన అండమాన్-నికోబార్ దీవులకు చేరుకున్నాయి. ప్రస్తుతం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రాంతంతో పాటు ఒక తుఫాను కూడా చురుకుగా కదులుతోంది. ఈ తుఫాను రుతుపవనాల ప్రవాహాన్ని ముందుకు తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి.
అండమాన్ నికోబార్ దీవుల్లోకి రుతుపవనాలు ప్రవేశించిన తర్వాత 15 రోజుల్లోనే జూన్ 1వ తేదీన నాటికి కేరళకు చేరుకుంటాయి. అండమాన్ దీవుల్లోకి ముందుగానే ప్రవేశించడం వల్ల అవి కేరళకు కూడా అంతకంటే ముందే చేరుకునే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Abhijeet Dipke: కాక్రోచ్ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేపై దాడి.. నాలుగు సార్లు చెంపదెబ్బలు
-
Kundu couple: దీదీ తృణమూల్ను తుత్తునకలు చేసిన కుందు దంపతులు? ఒక సాదాసీదా పార్టీని లోక్సభలోనే కింగ్ మేకర్గా ఎలా మార్చారు!
-
PM Modi: స్లోవేకియాలో మోడీ పర్యటన.. ఇరు దేశాల సంబంధాలపై చర్చ
-
Stop Diarrhoea Campaign: రేపటి నుంచి ‘స్టాప్ డయేరియా’ కార్యక్రమం.. 37.53 లక్షల చిన్నారులకు ఉచిత ఓఆర్ఎస్, జింక్ మాత్రలు
-
ICC Rankings: అగ్రస్థానంలో టీమిండియా.. ఆసీస్ పైకి.. సౌతాఫ్రికా కిందకు..
ట్రెండింగ్
-
Home Remedies : బంగాళాదుంప తొక్కలు పారేయొద్దు.. అందానికి బంగారు చిట్కా.!
-
HMD Vibe 2 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
11,000mAh బ్యాటరీతో రికార్డు దిశగా HONOR X80 Pro Max ఎంట్రీ.!
-
IND vs PAK: భారత్-పాక్ మ్యాచ్లో ఆటగాళ్ల మధ్య గొడవ.. వీడియో వైరల్.. ఇంతకీ ఏం జరిగిందంటే?
-
INDw vs PAKW: భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. వరల్డ్కప్ చరిత్రలోనే సరికొత్త రికార్డులు!