Delhi: దేశంలో చిన్నారులు, మహిళలపై అఘాయిత్యాలకు అడ్డుకట్టపడటం లేదు. అభంశుభం తెలియని చిన్నారులు పాలిట మృగాళ్లు కర్కశంగా వ్యవహరిస్తున్నారు. పోక్సో, నిర్భయ వంటి చట్టాలు ఉన్నా కూడా కామాంధులు జంకడం లేదు. దేశంలో రోజుకు ఎక్కడో చోట అత్యాచార ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా తెలిసిన వారి నుంచే ఈ రకమైన వేధింపులను ఎదుర్కొంటున్నారు.