ఇరాన్పై యుద్ధానికి ట్రంప్ ఐదు రోజుల బ్రేక్ ఇచ్చారు. ఇరాన్తో సానుకూల చర్చలు జరుగుతున్న నేపథ్యంలో తాత్కాలికంగా యుద్ధానికి బ్రేక్ ఇచ్చినట్లుగా ట్రంప్ స్పష్టం చేశారు. కానీ ట్రంప్ ప్రకటనను ఇరాన్ ఖండించింది. అమెరికాతో ఎలాంటి చర్చలు లేవని తోసిపుచ్చింది.
Iran Supreme Leader: ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మోజ్తబా ఖమేనీ తన తొలి ప్రకటన చేశారు. గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై దాడులు చేస్తూనే ఉంటామని, వాటిని మూసేయాలని వార్నింగ్ ఇచ్చారు. తన శత్రువులపై ఒత్తిడి పెంచడానికి ‘‘హార్ముజ్ జలసంధి’’ని మూసే ఉంచాలని పేర్కొన్నాడు. అయితే, ఈ ప్రకటన వెలువడిన తర్వాత మరో వార్త అంతర్జాతీయ మీడియాలో సంచలనంగా మారింది.
ఇరాన్ కొత్త సుప్రీం లీడర్గా ఖమేనీ కుమారుడు మోజ్తాబా నియమితులయ్యారు. ఈ ప్రక్రియ జరిగి నాలుగు రోజులు గడుస్తున్నా.. ఇప్పటి వరకు మోజ్తాబా బహిరంగంగా ఎక్కడా ప్రత్యక్షం కాలేదు. అమెరికా, ఇజ్రాయెల్తో జోరుగా యుద్ధం జరుగుతున్నప్పటికీ ఒక్క సమీక్ష కూడా నిర్వహించలేదు. దీంతో తాజాగా కొత్త కథనాలు వెలుగులోకి వస్తున్నాయి.