తెలంగాణలో స్థానిక సంస్థల కోటాలోని ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు ముగిశాయి. 5 జిల్లాల్లోని ఆరు స్థానాలకు పోలింగ్ జరిగింది.. ఆదిలాబాద్, నల్గొండ, ఖమ్మం, మొదక్ జిల్లాల్లో ఒక్కో స్థానం, కరీంనగర్లో రెండు స్థానాలకు పోలింగ్ నిర్వహించారు అధికారులు.. ఇక, ఈ నెల 14వ తేదీన ఓట్లను లెక్కించి ఫలితాలను ప్రకటించనున్నారు.. అయితే, ఎమ్మెల్సీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారు ఖమ్మం స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకిదిగిన రాయల నాగేశ్వరరావు.. కౌంటింగ్ను నిలిపివేయాలని కోరారు..…