తమ డిమాండ్ల సాధనకు గత పది రోజులుగా గ్రామ పంచాయతీ సిబ్బంది సమ్మె చేస్తుంది. ఇవాళ్టి (సోమవారం) నుంచి తమ ఉద్యమం తీవ్రం చేయాలని గ్రామ పంచాయతీ ఉద్యోగులు నిర్ణయించారు. ఈ నెల 18 నుంచి ఎమ్మెల్యేల ఇళ్ల ఎదుట ధర్నాలు, 19న మండల కేంద్రాల్లో రాజకీయ పార్టీలు, ట్రేడ్ యూనియన్లతో రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేయాలని గ్రామ పంచాయతీ ఉద్యోగ, కార్మిక సంఘాల జేఏసీ నిన్న (శనివారం) నిర్ణయించింది.