గద్వాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మాట్లాడుతూ.. డీకే అరుణ తెలంగాణ హైకోర్టును తప్పుదోవ పట్టించారు అని ఆయన ఆరోపించారు. ఫోర్జరీ డాక్యుమెంట్లతో తప్పుడు సమాచారం ఇచ్చారు.. హైకోర్టును తప్పుదోవ పట్టించిన డీకే అరుణకు శిక్ష తప్పదు అంటూ ఎమ్మెల్యే అన్నారు.