తెలంగాణ బడ్జెట్ సమావేశాలు నిన్న ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే నిన్న ఆర్థిక శాఖ మంత్రి హరీష్రావు బడ్జెట్ను ప్రవేశపెట్టిన సమయంలో బీజేపీ ఎమ్మెల్యేలు నల్ల కండువాలు ధరించి ఆందోళన చేపట్టారు. దీంతో స్పీకర్ బీజేపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే బాల్క సుమన్ మాట్లాడుతూ.. బడ్జెట్ ప్రవేశ పెట్టిన సందర్భంలో బీజేపీ ఎమ్మెల్యేలు ముందే అనుకొని నల్ల కండువాలతో అరిచారని, స్పీకర్ వెల్ లోకి వెళ్లే ప్రయత్నం చేశారని ఆయన ఆరోపించారు. ఆ…
పరిగిలో రేవంత్ రెడ్డి పిచ్చిలేసినట్టు మాట్లాడాడు.. రేవంత్ రెడ్డి ఒక కమెడియన్ అంటూ ప్రభుత్వం విప్ బాల్క సుమన్ తీవ్ర అగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. రేవంత్ లో విషం తప్పా …విషయం లేదని, రైతు ఆత్మహత్యలు ఎక్కువగా కాంగ్రెస్ హయాంలోనే జరిగాయని ఆయన అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో రేవంత్ చంద్రబాబు చెప్పులు మోసారు అని ఆయన విమర్శించారు.. రేవంత్ రెడ్డి జోకర్ లెక్క మాట్లాడుతున్నాడు…ఒక ట్యూటర్ ను పెట్టుకోవచ్చు కదా అని…
హుజురాబాద్ ఉప ఎన్నిక దగ్గర పడుతున్న నేపథ్యంలో రాజకీయ పార్టీల ప్రచారంలో వేడి పెరుగుతోంది. ప్రభుత్వ విప్ బాల్క సుమన్ బీజేపీ సిగ్గులేని రాజకీయాలు మానుకోవాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ కి ఓటమి భయం పట్టుకుంది. అందుకే దాడులకు దిగుతోందని బాల్క సుమన్ ఆరోపించారు. బీజేపీ గెలిచే పరిస్థితే ఉంటే.. దాడులకు దిగుతుందా..? అని ప్రశ్నించారు. బీజేపీ ఫ్రెస్టేషన్లో ఉందని, కిషన్ రెడ్డి తన స్థాయిని మరిచి చిల్లర రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. Read Also…
దళిత బంధు పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సీఎం కేసీఆర్.. మొదట హుజురాబాద్ నియోజకవర్గం నుంచి అమలు చేయాలని భావించారు.. కానీ, తాను దత్తతకు తీసుకున్న వాసాలమర్రి నుంచే ఆ పథకం అమలుకు పూనుకున్నారు.. ఇప్పటికే ఆ గ్రామంలోని 76 దళిత కుటుంబాలకు రూ.10 చొప్పున ఫండ్స్ రిలీజ్ చేసింది ప్రభుత్వం.. మరోవైపు.. దళిత బంధుపై విమర్శలు వస్తున్నాయి.. ఆ విమర్శలపై స్పందించిన ప్రభుత్వ విప్ బాల్క సుమన్.. దళిత బంధు పథకాన్ని బీజేపీ పార్టీ అడ్డుకునే ప్రయత్నం…
టి.పీసీసీ చీఫ్గా నియమితులైన రేవంత్రెడ్డిపై సెటైర్లు వేశారు ప్రభుత్వ విప్, టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్.. కరీంనగర్ జిల్లా ఇళ్లందకుంట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సోషల్ మీడియా వారియర్స్ సమ్మేళనం కార్యక్రమానికి హాజరైన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పలు అంశాలపై స్పందించారు.. కొత్త బిచ్చగాడు పొద్దు ఎరుగడు అన్నట్టు రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని.. టీఆర్ఎస్ లో చేరిన 12 మంది ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టండి అంటున్నాడు.. మరి.. డబ్బులు ఇస్తూ రెడ్ హ్యాండ్ గా…
నేడు ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ను సీఎం కేసీఆర్ పరామర్శించనున్నారు. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు రోడ్డుమార్గం ద్వారా సుమన్ స్వగ్రామమైన జగిత్యాల జిల్లా మెట్పల్లిలోని రేగుంటకు చేరుకుంటారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల వరకు సుమన్ ఇంటివద్ద ఉండనున్నారు. సుమన్ తండ్రి సురేష్ చిత్రపటానికి నివాళులర్పిస్తారు. సుమన్తో పాటు ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొననున్నారు. తిరిగి మధ్యాహ్నం 2 గంటలకు…